ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో నివసిస్తున్న ప్రజలందరి యొక్క సమగ్ర సమాచారాన్ని తన దగ్గర ఉంచుకోవాలానే ఉద్దేశ్యం తో ప్రజా సాధికార సర్వే ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వo చేపట్టనుందని గత కొన్ని రోజులుగా మనం వార్తాపత్రిక లలో చూస్తూనే ఉన్నాము. ప్రజలకు సంబంధించి మొత్తం 83 రకాల సమాచారాన్ని ప్రభుత్వం సేకరించనుందని కూడా మనం పత్రికల లో చూస్తూనే ఉన్నాము. అయితే అసలు ఆ సర్వే ఎలా జరగనుంది, ఎన్యుమరేటర్ లు ప్రజల నుండి వివరాలు సేకరించే ప్రక్రియ ఎలా ఉండనుంది తదితర అంశాలతో కూడిన సమగ్ర విశ్లేషణ ఈ వ్యాసం ప్రభుత్వ పాలనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం లో అందే వేసిన చేయి అయిన కృష్ణా జిల్లా కలెక్టర్ ఎ.బాబు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఐటి సలహాదారు అయిన ప్రద్యుమ్న ల మానస పుత్రిక గా సర్వే ను అధికార వర్గాలు భావిస్తున్నాయి. ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత మరియు రాష్ట్ర ప్రజలకు సంబందించిన సమగ్ర సమాచారం అంతా ఒకే ప్లాట్ ఫాం లో ఉండే విధంగా పూర్తీ ఆన్ లైన్ విధానం లో ఈ సర్వే జరగనుంది. నోడల్ ఏజెన్సీ మరియు ఎన్యుమరేటర్ ల ఎంపిక :- నిత్యం వివిధ రకాల పనులతో అత్యంత బిజీగా ఉండే రెవెన్యూ డిపార్టుమెంటు ను ఈ సర్వే కు నోడల్ ఏజెన్సీ గా నియమించారు. దీన్నిబట్టి ప్రభుత్వం ఈ సర్వే ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో అర్థం అవుతుంది. క్షేత్ర స్థాయిలో VRO, పంచాయితీ సెక్రెటరీ, మునిసిపల్ ఉద్యోగులు ఎన్యుమరేటర్ లుగా నియమించారు. IKP, డ్వాక్రా మరియు ఇతర విభాగాల వారిని వీరికి సహాయకులుగా నియమించారు. ఒక్కో ఎన్యుమరేటర్ కు ఒక్కో బ్లాక్ ను కేటాయిస్తారు.వీరికి సహాయకులు సహాయం చేస్తారు. ప్రతి పదిమంది ఎన్యుమరటర్ లకు ఒక సూపర్ వైజర్ ఉంటారు. సాధారణంగా వీరు రెవెన్యూ ఇన్స్పెక్టర్ అయి ఉంటారు. వీరందరినీ మండల గణాంక అధికారి పర్యవేక్షిస్తూ ఉంటారు. వీళ్ళందరికీ ఇంచార్జ్ అధికారి గా తహసిల్దార్ ఉంటారు. అన్ని మండలాలనూ సంబందిత RDO లు నిరoతరం సమీక్షిస్తూ ఉంటారు. జిల్లా కలెక్టర్ తో పాటు ప్రత్యేకంగా జిల్లాకొక IAS అధికారి నోడల్ ఆఫీసర్ గా ముఖ్యమంత్రి నియమించారు. పరికరాలు”:- ప్రతీ ఎన్యుమరేటర్ కూ ఒక ట్యాబ్, బయో మెట్రిక్ మెషిన్, ఐరిస్ యంత్రం లను అందిస్తారు. ఈ ట్యాబ్ లలో 3 జి సిం లను ఇన్ స్టాల్ చేస్తారు. బయో మెట్రిక్ తో వెలి ముద్రలు సరిపోల్చవలసి ఉంటుంది. ఐరిస్ తో కంటి పాపలను చెక్ చేస్తారు. మొదటగా ట్యాబ్ లలో గూగుల్ ప్లే స్టోర్ నుండి స్మార్ట్ పల్స్ సర్వ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోవలసి ఉంటుంది. సర్వే విధానం :- ట్యాబ్ లలో ఇన్ స్టాల్ చేయబడిన యాప్ ను ఓపెన్ చేయాలి. ఎన్యుమరేటర్ లు తమ అదార్ నెంబర్ మరియు బయో మెట్రిక్ ద్వారా లాగ్ ఇన్ అవ్వ వలసి ఉంటుంది. వెంటనే అతనికి కేటాయించిన బ్లాక్ లోని ప్రజల వివరాలు ప్రత్యక్షం అవుతాయి.వెంటనే డోర్ నెంబర్ ను సెలక్ట్ చేసుకుని సదరు ఇంటికి సర్వే నిమిత్తం వెళ్ళవలసి ఉంటుంది.ఆ ఇంటిలోని సభ్యుల వివరాలు సేకరించే ముందు ట్యాబ్ లో ఆ ఇంటిని ఫోటో తీసి GPS కు కనెక్ట్ చేయవలసి ఉంటుంది.-GPS ను తీసుకున్న తర్వాత బటన్ గ్రీన్ రంగు లోనికి మారుతుంది. ఈ అదార్ మరియు బయో మెట్రిక్ అనేది ఎన్యుమరేటర్ కి మరియు హౌస్ హోల్డ్ కీ ఒకే రకంగా ఉంటుంది. ఆ తర్వాత ఇంటిలోని కుటుంబ పెద్ద మొదలు అందరి వివరాలు సేకరించాలి. ఈ క్రమం లో వారి అదార్ నెంబర్ ను బయో మెట్రిక్ తో సహా సరి చూడాలి.హౌస్ హోల్డ్ యొక్క వివరములు రేషన్ కార్డును కూడా తీసుకోవాలి.ఎన్యుమరేటర్ లు సేకరించే వివరాలు ఈ క్రింది విధం గా ఉంటాయి.
ఇవి కొన్ని మాత్రమే. ఈ వివరాలన్నింటి లోనూ అనేక ఉప తరగతులు తో కూడా కలిపి మొత్తం 83రకాల వివరాలను ఎన్యుమరేటర్ లు సేకరిస్తారు. వివరాల సేకరణ పూర్తీ అయిన తర్వాత ఇంటి యజమాని దగ్గరనుండి స్వీయ ధృవీకరణ మరియు బయో మెట్రిక్ ధృవీకరణ ను తీసుకుంటారు. ఇలా సేకరించిన వివరాలు అన్నింటినీ ఏ రోజుకారోజు అప్ లోడ్ చేయవలసి ఉంటుంది. ప్రతీ ఎన్యుమరేటార్ రోజుకు 14 ఇళ్ళను దర్శించవలసి ఉంటుంది. ఈ సర్వే లో మరొక విశేషం ఏమిటంటే ఎవరికైనా అదార్ కార్డు, రేషన్ కార్డు లేనట్లయితే అవి వెంటనే వచ్చే విధంగా ఈ సర్వే ని డిజైన్ చేశారు.వీటి వివరాలు మరొక వ్యాసం లో సవివరంగా చర్చిద్దాం. ప్రస్తుతానికి మీ దగ్గరకు వచ్చే ఎన్యుమరేటార్ లకు సహకరించి మీ వివరాలు చెప్పి ప్రభుత్వానికి సహకరించండి. |