రెవెన్యూ వ్యవస్థ లో సాంకేతిక పరిజ్ణానాన్ని విరివిగా ఉపయోగించుకునే దిశగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చర్యలు వేగం చే సింది. రాష్ట్రం లోని భూముల వివరాలను కంప్యూటరీకరణం చేసేందుకు వెబ్ ల్యాండ్ అనే పోర్టల్ ను ప్రారంభించింది.పట్టాదారు యొక్క అన్ని వివరాలు వెబ్ ల్యాండ్ లో నమోదు చేస్తారు.కాగిత రహిత పాలనను అందించడ మే ధ్యేయంగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నది. వి ఆర్ ఒ స్థాయి అధికారులకు టాబ్లెట్ పి సి లను అందిచారు.
ప్రభుత్వ భూములకు సంభందించిన వివరాలను సర్కార్ భూమి అనె వెబ్ సైట్ లో నమోదు చే శారు. భూమి కలిగిన ప్రతి రైతు యొక్క ఆధార్ నoబరును సేకరించి దానిని అతని యొక్క ఖాతా తో అనుసంధానం చేస్తారు. దీని వలన అతనికి ఇంకా మరి ఏ ప్రదేశం లో నైనా భూములు ఉన్నా సరే ఒక్క క్లిక్ తో తెలిసి పోతుంది.అంతే గాక రెవెన్యు శాఖలో కీలకమైన పట్టాదారు పాసు పుస్తకాలను కూడ రద్దు చెసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుంది.దానికి బదులుగా వెబ్ ల్యాండ్ లో 1 బి నమూనా ను తీసుకో వచ్చును. రేషన్ పంపిణీ లో ఈ పాస్ విధానాన్ని ఇప్పటీకే విజయ వంతంగా ప్రవేశ పెట్టింది.ఈ రకంగా రెవెన్యూ వ్యవస్థ లో ఐ టి పరిజ్ఞానా న్ని విరివిగా ఉపయో గిస్తున్నారు.