ఇక నుం డి రైతులు త,మా యొక్క భూమి వివరాలు కావాలంటే తహసిల్దార్ ఆఫీసుల చుట్టూ తిరగవలసిన అవసరం లేదు. మీ దగ్గర నెట్ కనెక్షన్ ఉంటె చాలు ఒక్క క్లిక్ లో మీ భూమి వివరాలు మీ ముందు ప్రత్యక్ష మవుతాయి.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ని అన్ని భూముల వివరాలను ప్రభుత్వం ఎప్పుడో వెబ్ ల్యాండ్ లో నమోదు చేసింది. అయితే ఆ వివరాలను రైతుల కోసం బహిరంగంగా ఆన్ లైన్ లో ఉంచింది. దీని కోసం మీ భూమి అనే పోర్టల్ ను ఆంధ్ర ప్రదేశ్ రెవెన్యూ మంత్రి కే యి కృష్ణ మూర్తి ప్రారంభించారు.
ఇంతకు ముందు ఈ వివరాలన్నీ ఎమ్మార్వో ఆఫీసులలో ఉండేవి.రైతులు ఏదైనా సమాచారం కావాలంటే మీ సేవ లో దరఖాస్తు చేసుకుని రోజుల తరబడి వారి చుట్టూ తిరగ వలసి ఉండేది. కాని ప్రభుత్వ పాలన లో కంప్యూటర్ వాడకం పెరగడం తో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా ఉపయోగించి కోవడం తో పాలన సులభం అవడమే కాక అవినీటి రహితం, గానూ మారింది.
మనిషి దైనందిన జీవితం లో కంప్యూటర్ ఒక విడదీయరాని బంధం గా మారిన ఈ రోజుల్లో కొంచెం కంప్యూటర్ పరిజ్ఞానాన్ని కలిగి ఉండడం నష్టమేమీ కాదు కదా?