రిపబ్లిక్ డే సందర్భంగా ఇన్స్టాగ్రామ్లో తన కొత్త ఫాలోయర్స్కి అమెజాన్ 9వేల విలువైన గిఫ్ట్ కార్డ్లు ఇస్తుంది.
ఇన్స్టాగ్రామ్లో కొత్త ఫాలోయర్స్ చేసే మెన్షన్లకు పేటీఎం వాళ్ల వాలెట్లో 4వేల రూపాయలు యాడ్ చేస్తుంది.
మింత్రా తన ఇన్స్టాగ్రామ్ పేజీని షేర్చేస్తే 3,999 రూపాయల వోచర్స్ ఫ్రీగా ఇస్తుంది..
ఈ మెసేజ్లు మీలో ఎవరికి వచ్చినా రెస్పాండ్ అవకండి. ఆ పేజీలను మెన్షన్ చేయకండి. షేర్ చేయకండి. ఎందుకంటే ఫోటోషేరింగ్ ఫ్లాట్ఫాం ఇన్స్టాగ్రామ్ పేరిట కొంతమంది స్కామర్లు ఫేక్ పేజీలు క్రియేట్ చేసి జనాల్ని మోసం చేస్తున్నారు.
వేల మంది చేసేశారు
ఈ మెసేజ్లు చూసి చాలామంది ఇన్స్టాగ్రామ్లో పేజీలను, అకౌంట్లను ఫాలో అవుతున్నారు. ఆ ఫేక్ పేజీలను షేర్ చేసి మింత్రా, అమెజాన్ల నుంచి ఓచర్లు వస్తాయని ఆశగా ఎదురుచూస్తున్నారు. పేటీఎం వాలెట్లో మనీ క్రెడిట్ అవుతుందని చూస్తున్నారు. అమెజాన్గోఇండియా పేరిట స్కామర్లు నకిలీ ఇన్స్టాగ్రామ్ పేజీ క్రియేట్ చేశారు. ఈ పేజీని ఫాలో అయ్యే తొలి 30 వేల మందికి రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న 9వేల గిఫ్ట్వోచర్లు అమెజాన్ నుంచి ఇస్తామని చెప్పారు. దీంతో ఒక్క వారంలోనే ఈ పేజీకి 20వేల మంది ఫాలోయర్స్ యాడ్ అయ్యారు. వీరంతా ఈ రోజు వోచర్ కోడ్స్ వివరాలు వస్తాయని ఆశగా ఎదురుచూస్తున్నారు. అందులో తానూ ఒక్కడినని ప్రవీణ్ కౌర్ అనే వ్యక్తి చెప్పారు.
వాళ్లకేంటి లాభం?
ఇలా ఫేక్ పేజీలు సృష్టించి నెటిజన్స్ను నమ్మిస్తారు. ఇంతకుముందు చాలామంది చేరారు. మీరు కూడా త్వరపడండి అని నకిలీ స్క్రీన్షాట్స్, క్యూఆర్ కోడ్స్ పంపి ఎట్రాక్ట్ చేస్తారు. సాధారణంగా ఇలాంటి ఫేక్ పేజీలు బాగా పాపులరయిన కంపెనీల పేర్లను వాడుకుంటాయి. పేటీఎం డీల్స్, ఫ్లిప్కార్ట్ అఫీషియల్, అమెజాన్ వోచర్ ఇలా పేర్లు పెడతాయి. ఈ ఆఫర్లను నమ్మి ఫాలోయర్లు భారీగా చేరతారు. ఓ 10వేల మంది ఫాలోయర్లు చేరగానే దాని పేరు మార్చి తమ పేజీకి ఇంతమంది ఫాలోయర్లు ఉన్నారంటూ కంపెనీలకు అమ్మేస్తారు. ఫాలోయర్ల సంఖ్యను బట్టి ఒక్కో పేజీని 2వేల నుంచి 5వేలకు అమ్ముకుంటారు. ఇలా రకరకాల పేజీలు క్రియేట్ చేసి వారానికి లక్షల్లో సంపాదిస్తారు. దీనిలో పేజీ ఫాలోఅయినవారికి వ్యక్తిగతంగా లాసేమీ లేకపోయినా మీ పేరిట వాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్ తోపాటు ఫేస్బుక్ పేజీల పేరిట ఇలాంటి బిజినెస్ జరుగుతోందని, దీన్నికంట్రోల్ చేయాలంటున్నారు టెక్ ఎక్స్పర్ట్లు.