• తాజా వార్తలు

పే టి ఎం ద్వారా రూ 76/- ల క్యాష్ బ్యాక్ ఇస్తున్న జియో

మీరు రిలయన్స్ జియో మరియు పే టి ఎం రెండింటికీ కస్టమర్ లు గా ఉన్నారా? అయితే మీకొక శుభవార్త. పే టి ఎం ద్వారా రీఛార్జి చేసిన వారికీ జియో రూ 76/- ల క్యాష్ బ్యాక్ ను అందిస్తుంది. రూ 300/- లు  ఫై రీఛార్జి చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తించనుంది. అయితే ఇది అందరికీ అందుబాటులో ఉంటుందా? లేక నెంబర్ కూ నెంబర్ కూ మారుతుందా? లేక సెలెక్టెడ్ కస్టమర్ లకు మాత్రమే అందుబాటులో ఉంటుందా అనేది మాత్రం అస్పష్టం గా ఉన్నది.అయితే మీరు రీఛార్జి చేసిన 24 గంటల లోనే ఈ 76/- రూపాయలు మీ పే టి ఎం ఎకౌంటు కు క్రెడిట్ అవ్వనున్నాయి. అయితే నేషనల్ కాపిటల్ రీజియన్ లో మాత్రం దీనికి సంబంధించి ఒక ప్రోమో కోడ్ ను కూడా విడుదల చేయడం జరిగింది.

దీనిని పొందడం ఎలా?

  1. రిలయన్స్ జియో యూజర్ లు తమ ఫోన్ లలో పే టి ఎం యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవాలి.
  2. ఆ యాప్ ను ఓపెన్ చేసి మీ సిమ్ యొక్క ప్లాన్ ప్రకారo మొబైల్ ప్రీ పెయిడ్ లేదా మొబైల్ పోస్ట్ పెయిడ్ పై క్లిక్ చేయాలి.
  3. మీ జియో నెంబర్  ను ఎంటర్ చేసి ప్రొసీడ్ రీఛార్జి అనే ఐకాన్ పై క్లిక్ చేయాలి.
  4. అప్పుడు పేజి యొక్క క్రింద భాగం లో హ్యావ్ అ ప్రోమో కోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
  5. ప్రోమో కోడ్ ను ఎంటర్ చేయడానికి లింక్ పై ట్యాప్ చేసి డన్ పై సెలెక్ట్ చేయండి.
  6. జియో యొక్క ఆఫర్ ల ప్రకారం పే టి ఎం ప్రోమో కోడ్ లను కలిగి ఉంటుంది. కాబట్టి మీరు ఆ ఆఫర్ ను చూసినపుడు దానిపై క్లిక్ చేస్తే చాలు , ప్రోమో కోడ్ ను ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు.
  7. ఒక్కసారి రీఛార్జి పూర్తీ అయిన తర్వాత 24 గంటల లోగా రూ 76/- లు మీ పే టి ఎం ఎకౌంటు కు క్రెడిట్ చేయబడుతుంది.
  8. కేవలం పే టి ఎం మాత్రమే గాక ఫోన్ పే లో కూడా జియో క్యాష్ బ్యాక్ ను ఆఫర్ చేస్తుంది.
  9. జియో కలిగి ఉన్న అనేక ఆఫర్ లను మై జియో యాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

జన రంజకమైన వార్తలు