ఇండియా.. అత్యధిక జనాభా ఉన్న దేశాల్లో రెండోది. విస్తీర్ణంలో ఏడోది ..చిన్నప్పటి నుంచి చదువుకుంటున్న జనరల్ నాలెడ్జి పుస్తకాల్లో ఇలాంటి ర్యాంకింగులు అందరం చూసే ఉంటాం. కానీ ఇప్పుడు ఇండియా కొత్త రూపు సంతరించుకుంటోంది. డిజిటల్ రూపంలో ప్రబల శక్తిగా ఎదుగుతోంది. ఇప్పటికే ప్రపంచంలో ఈ విషయంలో భారత్ తనకంటూ ప్రత్యేకత సొంతం చేసుకుంది. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడుతూ పరుగులు తీస్తోంది. ఆ పరుగు పందెంలో కొత్త రికార్డులు తన ఖాతాలో వేసుకుంటోంది. జనాభా, విస్తీర్ణం వంటి సాధారణ అంశాల్లో సాధించిన ర్యాంకులు కాదు.. ప్రపంచం తలరాతను మారుస్తున్న టెక్నాలజీ రంగంలో రోజురోజుకూ తన ర్యాంకు మెరుగుపరుచుకుంటూ అగ్రపథం దిశగా సాగిపోతుంది. ఆ అలుపెరగని ప్రయాణంలో ఇప్పుడు ఇండియా ఎక్కడుందో తెలుసా..? ఐటీ ఇండస్ర్టీ కాంపిటీటివ్ ఇండెక్స్ లో ఇండియా స్థానం 2 మొబైల్ ఫోన్ వాడకంలో 2వ స్థానం ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్యలో 3వ స్థానం ఈ లెక్కలు చాలు ఇండియాలో టెక్నాలజీ రంగం ఎంత కీలకంగా మారిందో చెప్పడానికి. ప్రపంచంలోనే ఐటీ సేవలకు ఇప్పుడు భారతే అతిపెద్ద గమ్యస్థానం. అంటే ప్రపంచమంతా ఇప్పుడు భారతదేశం వైపే చూస్తోందన్నమాట... అలాంటప్పుడు భారత్ మాత్రం సాంకేతిక రంగాన్ని ఎందుకు విస్మరించాలి? కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తనకు తాను వేసుకున్న ఈ ప్రశ్న ఇప్పుడు దేశ ముఖచిత్రాన్ని మార్చడానికి సమాధానమై తిరిగిరానుంది. మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్, నాలుగు రోజుల కిందట ప్రవేశపెట్టిన రైల్ బడ్జెట్ రెండూ కూడా దేశంలో సాంకేతిక రంగంలో కొత్త శకానికి నాంది పలికాయనే చెప్పుకోవాలి. మునుపెన్నడూ లేనట్లుగా సాంకేతికరంగానికి పెద్ద పీట వేశారు. భారత్ ను ఇ-భారత్ గా మార్చేందుకు ప్రణాళికలతో ముందుకొచ్చారు. ఈ సాంకేతిక విప్లవ ఫలితాలు మున్ముందు దేశ గతిని మారుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మోడీ ప్రభుత్వం గద్దెనెక్కాక ప్రాధాన్యాలుగా తీసుకున్న పథకాల్లో 'డిజిటల్ ఇండియా' ఒకటి. సాంకేతిక సేవలను, సౌకర్యాలను ప్రజలకు అందుబాటులోకి తేవడం దీని లక్ష్యం. సేవల్లో ఆలస్యం తగ్గడంతో పాటు సౌలభ్యం, పారదర్శకత, అవినీతి నిర్మూలన వంటి అన్నిటికీ ఇదే సరైన మార్గంగా భావించిన మోడీ డిజిటల్ ఇండియా పథకంలో అనేక లక్ష్యాలను ఏర్పరుచుకున్నారు. ఇప్పటికే వాటిలో కొన్ని అమలు చేసి ప్రగతి సాధించారు. తాజా బడ్జెట్ లోనూ సాంకేతిక పరుగుకు ప్రోత్సాహం అందించేలా చర్యలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఐటీ సేవలకు పెద్ద పీట వేస్తున్నారు. ఈ-కామర్స్ కు వెన్నుదన్నుగా నిలిచారు. పదిహేనేళ్ల కిందట దేశ జీడీపీలో ఐటీ సేవల వాటా కేవలం 1.2... ఇప్పుడు 9.6 శాతం వాటా ఉంది. అంటే... దేశ జీడీపీలో ఐటీ వాటా 8 రెట్లు పెరిగిందన్నమాట. ప్రపంచంలోని ఎన్నో దేశాలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతన్న ప్రస్తుత తరుణంలో దేశ ఆర్థిక వ్యవస్థకు అండగా నిలిచిన రంగానికి మరింత ప్రాధాన్యమిస్తే అది అన్ని రకాలుగా ప్రయోజనకరమని నమ్మి ఐటీ సేవలను విస్తృతం చేసే దిశగా చర్యలు ప్రారంభించారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన 2016-17 బడ్జెట్ లో సాంకేతిక రంగానికి సంబందించిన అంశాలు చూస్తే గత ఏ బడ్జెట్ లోనూ ఈ రంగానికి ఇంత ప్రాధాన్యం దక్కలేదన్న విషయం అర్తమవుతుంది. ఇవన్నీ సాధ్యమైన తరువాత భారత దేశం ఎలా మారబోతుందో ఊహించుకోవచ్చు. పల్లె నుంచి ఢిల్లీ వరకు ప్రతిచోటా టెక్నాలజీయే రాజ్యమేలుతుంది. సేవాకేంద్రాలు, టిక్కెట్ కౌంటర్లు వంటివాటి వద్ద రద్దీయే ఉండదు. కూర్చున్న చోటు నుంచే అన్ని పనులూ పూర్తి చేసుకునేలా రోజులు మారిపోబోతున్నాయి. మరి ఈ డిజిటల్ విప్లవానికి జైట్లీ వేసిన మెట్లేంటే చూద్దామా...
వీటితో పాటు దాదాపుగా ప్రతిరంగంలో ఎలక్ర్టానిక్ సేవలకు ప్రభుత్వం తెరతీసింది.
... ఇవన్నీ దేశీయ ఐటీ రంగాన్ని పరుగులు తీయించే చర్యలుగానే చెప్పుకోవచ్చు. డిజిటల్ సాక్షరతా మిషన్, అగ్రికల్చర్ ఈ-మార్కెట్ వంటి ఇనిషియేటివ్స్ వల్ల టెక్నాలజీ, ఇంటర్నెట్ పూర్తిగా గ్రామస్థాయికి చొచ్చుకుపోవడం ఖాయం. ఇది భారత ప్రజలకు, వారిపై ఆధారపడే ఐటీ రంగానికి రెండిటికీ మేలు చేయబోతోంది. తగ్గింపులు... టెక్నాలజీ సంబంధిత పరికరాలను అందరికీ అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో పన్నులను భారీగా తగ్గించారు. ఇంటర్నెట్ సులభంగా యాక్సెస్ చేసుకోవడానికి.. కంప్యూటర్, మొబైల్ ఆధారిత సేవలను మరింతగా పొందేందుకు ఇది మార్గం వేస్తుందని ఆశిస్తున్నారు.
రైల్వేల్లో 'డిజిటల్' కూత రైల్వే బడ్జెట్ లోనూ టెక్నాలజీకి పెద్ద పీట వేసిన సంగతి తెలిసిందే.
..ఇలా రైల్వేల్లోనూ టెక్నాలజీని భారీ స్థాయిలో వినియోగిస్తూ ప్రయాణికుల కష్టాలను తగ్గిస్తున్నారు. ప్రభుత్వం ఆశిస్తున్నది, ప్రజలు కోరుకుంటున్నది అన్నీ జరిగితే కొన్నాళ్లకు ఇండియా సాంకేతిక రంగంలో ప్రపంచ దేశాల సరసన సగర్వంగా తలెత్తుకోవడం ఖాయం. మీ జ్ఞాన తేజ నిమ్మగడ్డ సంపాదకుడు కంప్యూటర్ విజ్ఞానం తొలి తెలుగు సాంకేతిక పత్రిక |