మనలో మొబైల్ వాడని వాళ్లు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే ఎక్కువశాతం మంది మొబైల్స్ ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు తగ్గట్టు.. అందరికితో కలిసి ముందుకు వెళ్లడానికి మొబైల్ వాడకం రాని వాళ్లు కూడా నేర్చుకుని మరీ దాన్ని యూజ్ చేస్తున్నారు. ఈ మొబైల్తో మనం కాల్స్ మాత్రమే చేయం. చాలా పనులు చేస్తాం. బ్యాంకు లావాదేవీలు నిర్వహిస్తాం. విలువైన సమాచారాన్ని దాస్తాం. మరి ఈ డేటా అంతా సురక్షితమేనా! మన మొబైల్ సెక్యూర్గా ఉండాలంటే ఏం చేయాలి?
హ్యాకింగ్తోనే ప్రమాదం
ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది యూజర్లు మొబైల్ ద్వారానే ఇంటర్నెట్ వాడుతున్నారు. మరి ఇది ఎంత వరకు సేఫ్ అంటే చెప్పలేని పరిస్థితి. ఇంటర్నెట్ వాడుతున్నామంటేనే మనం సేఫ్ జోన్లో ఉన్నట్లు కాదు. ఎందుకంటే హ్యాకర్లు నిరంతరం పొంచి ఉంటారు. ఎప్పుడు అవకాశం వచ్చినా దాడి చేయడానికి సిద్ధంగా ఉంటారు. మొబైల్ డేటా, కనెక్టివిటీ (బ్లూ టూత్, వైఫై), క్లౌడ్ సర్వీస్, టెల్కొ సర్వీస్ ప్రొవైడర్, యాప్ స్టోర్, వెబ్సైట్ల ద్వారా మనపై సైబర్ దాడులు జరిగే అవకాశాలున్నాయి.
దాడి చేస్తే హ్యాకర్లకు ఏం లాభం?
మీ మొబైల్ ఫోన్ల యాక్టివిటీస్ తెలుస్తాయి
మీ ఫైనాన్సియల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది
మీకు సంబంధించిన విలువైన సమాచారం దొంగిలించొచ్చు.
డివైజ్ను తన నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు
ఫ్రాడ్స్ కోసం మీ ఐడెంటిటీని యూజ్ చేసుకోవచ్చు
జాగ్రత్తలు తీసుకోండిలా..
జాగరూకతతో వ్యవరించాలి. అంటే ప్రతి విషయంపై అవగాహన పెంచుకోవాలి. మీరు చేసే ప్రతి పనిపై మీకు ఒక క్లారిటీ ఉండాలి
అన్లాక్ చేయకుండా ఎక్కడా ఫోన్ వదలకూడదు. దీని వల్ల మిస్ యూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
సిమ్ పిన్ పెట్టుకోవాలి. దీని వల్ల ఎవరూ మీకు తెలియకుండా ఫోన్ను యాక్సిస్ చేయలేరు.
ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసుకోవాలి. ఆటో సాఫ్ట్వేర్ అప్డేట్ను అనేబుల్ చేసుకోవాలి
మీ ఫోన్లో అనవసరమైన యాప్లను తీసేయాలి. ఉన్న యాప్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. అవసరమైతే అప్డేట్ చేయాలి.
బలమైన పాస్వర్డ్లు పెట్టుకోవాలి. స్టోరేజ్, మీడియా కార్డు ఎన్క్రిప్ట్ చేసుకోవాలి
అన్ నోన్, థర్డ్ పార్టీ అప్లికేషన్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.