ఒకప్పుడు ఆన్లైన్లో డబ్బులు పంపాలన్నా.. ఇతర ట్రాన్సాక్షన్లు చేయాలన్నా పేపాల్ ఎక్కువగా ఉపయోగించేవాళ్లు. అయితే మనీ పంపడానికి ఇతర ప్రత్యామ్నాయాలు వచ్చేశాక పేపాల్ అవసరం బాగా తగ్గిపోయింది. ముఖ్యంగా విదేశాల నుంచి డబ్బులు పంపేవాళ్లు పేపాల్ను ఉయోగించుకునేవాళ్లు కానీ ఇప్పుడు వాళ్లు కూడా ఇతర మార్గాల బాట పట్టారు. కారణాలు చాలానే ఉన్నాయి. పేపాల్లో ఛార్జీలు ఎక్కువగా ఉండడం, కొన్ని సైట్లు ఎలాంటి ఛార్జీలు లేకుండా లావాదేవీలు నిర్వహిస్తుండడంతో ఎక్కువమంది పేపాల్ వాడట్లేదు. అయితే పేపాల్కు ఎన్నోప్రత్యామ్నాయలు వచ్చినా... అందులో పేనీర్నే ఉత్తమమైందిగా చెప్పొచ్చు.
జీఎస్టీ రాకతో
గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) రాకతో భారత ఆర్థిక రంగంలోనూ మార్పులొచ్చాయి. జులై నుంచి జీఎస్టీని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ప్రజలు తక్కువ పన్నులు పడే వాటి మీద దృష్టి పెట్టారు. భారత్లో వినియోగదారుల మీద పడుతున్న ఇండైరెక్ట్ పన్నులకు చెక్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ల మీద పన్నును ఒక శాతం పెంచింది. అంటే ఆన్లైన్లో మనం చేసే ట్రాన్సాక్షన్ల మీద మరింత పన్ను భారం పడుతుంది. దీంతో పేపాల్ లాంటి సైట్లు కూడా ట్రాన్సాక్షన్ల మీద చేసే వసూళ్లు ఎక్కువ కానున్నాయి. దీంతో ప్రత్యామ్నాయాల కోసం జనం అన్వేషిస్తున్నారు. అయితే అన్నిటికన్నా ఉత్తమంగా పేనీర్ ముందంజలో ఉంది. పేనీర్తో కేవలం భారత్లోనే కాదు విదేశాల్లో ట్రాన్సాక్షన్లు చేసుకోవచ్చు. తక్కువ ట్రాన్సక్షన్ ఫీజులతో నడుస్తున్న ఈ సైట్ మీద అందరి దృష్టి పడింది. ఇప్పుడు దీన్ని 200 దేశాల్లో వినియోగిస్తున్నారు. గూగుల్, అమెజాన్ లాంటి దిగ్గజ కంపెనీలు కూడా ట్రాన్సాక్షన్ల కోసం ఈ సైట్నే ప్రిఫర్ చేస్తున్నాయి.
ట్రాన్సాక్షన్ మీద రూ.300 మిగులు
ఆన్లైన్ ట్రాన్సాక్షన్ల కోసం పేనీర్తో పాటు ఎన్నో సైట్లు అందుబాటులో ఉన్నాయి. కానీ దీన్ని మాత్రమే ఎందుకు వాడాలంటే అందుకు చాలా కారణాలు ఉన్నాయి. పేనీర్తో ట్రాన్సక్షన్ చేస్తే ఫీజులు చాలా తక్కువ. పేపాల్ కంటే అతి తక్కువ. ఎంతగా అంటే యూజర్లు ప్రతి ట్రాన్సాక్షన్ మీద కనీం రూ.300 ఆదా చేసుకునే అవకాశం ఉంది. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ల పరంగా ఇది పెద్ద ఆదానే. అంటే మీరు పది పేమెంట్లు చేస్తే దాదాపు రూ.3 వేల వరకు మీకు ఆదా అయ్యే అవకాశాలున్నాయి. మీరు చేసిన ప్రతి 100 డాలర్ల ట్రాన్సాక్షన్కు పేనీర్ కేవలం 2 డాలర్లే ఛార్జ్ చేస్తుంది. అంతేకాదు బ్యాంక్ ట్రాన్సఫర్ల విషయంలో పేనీర్తో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. బ్యాంక్ ట్రాన్సఫర్ చేయడానికి పేపాల్ లాగా పేనీర్ ఎలాంటి రుసుము వసూలు చేయదు. పేపాల్తో పోలిస్తే పేనీర్కు క్లయింట్ల సంఖ్య చాలా ఎక్కువ.