మీ స్మార్ట్ఫోన్లోని యాప్స్ మీ లొకేషన్ను ట్రాక్ చేస్తాయని అనుమానిస్తున్నారా? అయితే మీరు లొకేషన్ షేరింగ్ ఆఫ్ చేస్తే చాలదు. కెమెరా రోల్ షేరింగ్ను కూడా ఆఫ్ చేయాలి. ఎందుకంటే దీన్ని యూజ్ చేసుకుని కూడా యాప్స్ మీ లొకేషన్ను ట్రేస్ చేస్తున్నాయి.
ఎలా తెలుస్తాయి?
మీరు యాప్ డౌన్లోడ్ చేసి, ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు ప్రతి యాప్ పర్మిషన్స్ అడుగుతుంది. దీనిలో కెమెరా రోల్ కు సంబంధించిన యాక్సెస్ కూడా ఉంటుంది. మనం దీనికి యాక్సెస్ ఇస్తే ఫొటోస్ తీయడానికి, స్క్రీన్షాట్లు స్టోర్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదే ఫీచర్ను ఉపయోగించుకుని ఆ ఫోటో ఎక్క డ తీశారో దాన్ని బట్టి మనం ఉన్న లొకేషన్ను ట్రేస్ అవుట్ చేస్తున్నాయని ఫెలిక్స్ క్రాసే అనే ఐవోఎస్ డెవలపర్ కనిపెట్టారు. ఐవోఎస్ యాప్తో ఫోటో ఎక్సిఫ్ డేటాను యూజ్ చేసుకుని మీరున్న లొకేషన్ను ఎలా గుర్తిస్తాయో ఆయన వివరించాడు. మనం యాప్స్కు కెమెరా యాక్సెస్ ఇస్తే దాని ద్వారా మనం ఎక్కడ ఫొటో తీసుకున్నాం, ఏ వెహికల్లో వెళ్లారు, ఏ రూట్లో వెళ్లారనే వివరాలన్నీ తెలిసిపోతాయట.
కంట్రోల్ చేయవచ్చు
యాప్స్కు కెమెరా యాక్సెస్ ఇవ్వకుండా ఉంటే దీన్ని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. అయితే పూర్తిస్థాయిలో మీ లొకేషన్ ప్రైవసీ మీకు ఉండాలంటే మీ ఫొటోస్కు జియో టాగింగ్ తీసేయడమే సరైనా ఆప్షన్. ఆండ్రాయిడ్ యూజర్లు కెమెరా సెట్టింగ్స్లోనూ, ఐవోఎస్ యూజర్లు ప్రైవసీ సెట్టింగ్స్లోకి వెళ్లి జియోటాగింగ్ను డిజేబుల్ చేసుకోవచ్చు.