ఒకప్పుడు డబ్బులు పంపించాలంటే అదో పెద్ద ప్రాసెస్. బ్యాంకుకు వెళ్లడం..గంటల తరబడి నిలబడడం.. ఓపిక నశించడం లాంటి సీన్లు ఉండేవి. అంతేకానీ ఒక అకౌంట్లో వేయబోయి మరో అకౌంట్కు డబ్బులు వేయడం చాలా అరుదు. అయితే ఆన్లైన్ లావాదేవీలు పెరిగిపోయాక.. తప్పులు కూడా పెరిగాయి. ఆన్లైన్లో మనీ పంపించేటప్పుడు ఒక్కోసారి ఆ మనీ తప్పుడు అకౌంట్కు వెళ్లిపోవడం చాలా మామూలు విషయం అయిపోయింది. అయితే ఆన్లైన్ మోసాలు పెరిగిపోయిన తర్వాత మీరు తప్పుగా డబ్బులు వేయడం పక్కనపెడితే.. మీరు చేయని ట్రాన్సాక్షన్లకు కూడా మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతున్నాయి. మరి ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలి?
బ్యాంకులు ఏం చేస్తున్నాయి?
మన అకౌంట్లో మనకు తెలియకుండా డబ్బులు కట్ అయిపోతే బ్యాంకులు ఏం చేస్తున్నాయి. వాటి రెస్పాన్స్బిలిటీ ఏమిటి? అయితే ఈ విషయంలో బ్యాంకులు మాత్రం కష్టమర్లను బాగా ఇబ్బందిపెడుతున్నాయి. కట్ అయిన అయిన అమౌంట్ తిరిగి మళ్లీ మన అకౌంట్లోకి రావాలంటే అదో పెద్ద ప్రాసెస్. దానికి లెటర్లు రాయడం.. ఏటీఎం స్లిప్లు కలెక్ట్ చేసుకోవడం...వాళ్లను వీళ్లను కలవడం లాంటి కార్యక్రమాలు చాలా ఉంటాయి. ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలంటే..బ్యాంకులు తమ కస్టమర్లను తమ మొబైల్ నంబర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోమని చెప్పాలి. అంతేకాదు ఈమెయిల్ అలెర్ట్స్ వచ్చేలా చూడాలి.
కస్టమర్లు ఏం చేయాలి?
బ్యాంకు వల్లే తమ అకౌంట్లో డబ్బులు ఖర్చు అయితే అప్పుడు కస్టమర్లకు ఎలాంటి బాధ్యత ఉండదు. బ్యాంకు ఉద్యోగులే మోసాలకు పాల్పడితే కస్టమర్లు సైలెంట్గా ఉండకూడదు. అంబుడ్సమన్కు ఫిర్యాదు చేయాలి. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. ఫ్రాడ్ జరిగిన వెంటనే కస్టమర్లు మూడు రోజుల లోపే బ్యాంకుకు ఫిర్యాదు చేయాలి. కస్టమర్లు ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే కస్టమర్ల నిర్లక్ష్యం కారణంగా డబ్బులు కట్ అయినా కూడా బ్యాంకు వీలైనంత త్వరగా ఆ అమౌంట్ను అతని అకౌంట్లో డిపాజిట్ చేయాలి.