సాధారణంగా ఒక ఫోన్ నంబర్ను ఒకే ఫోన్లో వాడడం మనకు తెలుసు. మరి ఒకే మొబైల్ నంబర్ను రెండు ఫోన్లలో వాడడం ఎలాగో మీకు తెలుసా?.. భారత్లో కొన్ని మొబైల్ ఆపరేటర్లు మల్టీ సిమ్ సర్వీసులను ఆఫర్ చేస్తున్నాయి. ప్రతి అవసరానికి స్మార్ట్ఫోన్ మీద ఆధారపడుతున్న ఈ కాలంల ఎక్కుమంది ఒకటికి మించి ఫోన్లు వాడుతున్నారు. అయితే అన్నింట్లోనూ రకరకాల సిమ్లు వేయాలంటే కుదరదు. వాటిని మెయిన్టెన్ చేయడం ఖర్చు కూడా. అందుకే మల్టీ సిమ్ సర్వీస్ వచ్చింది. ఒకే మొబైల్ నంబర్ను రెండు ఫోన్లలో వాడుకోవడమే దీని ప్రత్యేకత.
ఏంటి మల్టీ సిమ్ సర్వీస్?
ఒకే సిమ్ కార్డును రెండు ఫోన్లలో వేసి వాడుకునే అవకాశాన్ని ఇవ్వడమే మల్టీసిమ్ స్పెషాలిటీ. అంటే మీరు ఏ ఫోన్తోనైనా కాల్స్ రిసీవ్ చేసుకోవచ్చు. ఫోన్లు చేయచ్చు. మెసేజ్లు చేయచ్చు. అంతేకాదు ఇంటర్నెట్ను కూడా రెండు ఫోన్లలో వాడుకునే అవకాశం ఉంది ఈ సర్వీసు ద్వారా. అన్ని డివైజ్లకు ఈ ఫోన్ల ద్వారా ఫోన్లు చేయచ్చు, మెసేజ్లు పంపొచ్చు.
ప్రైవేట్ నంబర్గా వాడుకోవచ్చు
ఒక్కోసారి కొన్నిమెసేజ్లను పంపడానికి, కాల్స్ రిసీవ్ చేసుకోవడానికి మనం ఒక ఫోన్ ఉపయోగిస్తాం. అంటే పర్సనల్ యూజ్ కోసం ఒక ఫోన్.. ఆఫీస్ యూజ్ కోసం మరో ఫోన్ ఉపయోగిస్తాయి. అయితే రెండు ఫోన్లలో ఒకటే సిమ్ ఉండడం వల్ల మీకు ఆ ప్రైవసీ ఉండకపోవచ్చు. కానీ ఒక ఫోన్లలో బ్యాటరీ అయిపోయానా లేదా సడెన్గా ఆ ఫోన్ ఆగిపోయినా మీ కాల్స్, మెసేజ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదంటే మల్టీ సిమ్ సర్వీసు మంచి ఆప్షన్.
అన్ని సర్వీసుల్లో లేదు..
అయితే ప్రస్తుతానికి ఈ సర్వీసును అన్ని మొబైల్ ఆపరేటర్లు ఇవ్వడం లేదు. వొడాఫోన్ వినియోగదారులు మాత్రమే ప్రస్తుతానికి దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఈ సర్వీసును ఉపయోగించాలంటే ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు. మల్టీ డివైజ్ సర్వీసు కోసం మాత్రం నెలకు రూ.400 చెల్లించాల్సి ఉంటుంది. అయితే వొడాఫోన్ టారిఫ్ను బట్టే బిల్ జనరేట్ అవుతుంది. త్వరలోనే అన్ని ఆపరేటర్లకు ఈ సర్వీసు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.