ప్రావిడెంట్ ఫండ్.. ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా ఇచ్చే నిధి. సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉండే ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పీఎఫ్ వ్యవహారాలు చూస్తుంది. పీఎఫ్ చందాదారులంతా తమ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)ను ఆధార్ నెంబర్తో లింకప్ చేసుకోవడం కంపల్సరీ అని EPFO ప్రకటించింది. దీన్ని ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చని చెప్పింది.
పీఎఫ్ అకౌంట్, ఆధార్ లింకేజి ఎలాగంటే..
1. EPFO అఫీషియల్ వెబ్సైట్ www.epfindia.gov.inలోకి వెళ్లండి
2. దానిలో Online Services సెక్షన్లోకి ఎంటరవ్వండి
3. eKYC Portal లింక్ను క్లిక్ చేయండి
4. ఇప్పుడు మీరు కొత్త పేజీలోకి డైరెక్ట్ అవుతారు. Link UAN Aadhaar అనే లింక్ ఉంటుంది.
5. దీనికి ఎంప్లాయి తమ UAN నెంబర్ను ఎంటర్ చేయాలి.
6.ఇప్పుడు UAN నెంబర్తో లింకయి ఉన్న మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది.
7. ఓటీపీ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై చేశాక మెంబర్ తన ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయాలి.
8. ఇప్పుడు ఆధార్ నెంబర్తో లింకయి ఉన్న మెయిల్ ఐడీ లేదా మొబైల్ నెంబర్కు మరో ఓటీపీ వస్తుంది.
9. ఓటీపీ వెరిఫికేషన్ పూర్తయి మీ UAN డిటెయిల్స్ ఆధార్ డిటెయిల్స్ మ్యాచ్ అయితే మీ UAN ఆధార్తో లింక్ అయిపోయినట్లే.
ఉపయోగాలేంటి?
పీఎఫ్ అకౌంట్ను ఆధార్తో లిక్ చేయడం వల్ల పీఎఫ్ క్లెయిమ్స్ను ఎంప్లాయర్ అటెస్టేషన్ లేకుండా డైరెక్ట్గా చేసుకోవచ్చు.
* మంత్లీ అప్డేట్స్ మొబైల్ నెంబర్కు వస్తాయి
* ఈ- పాస్బుక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
* పర్సనల్ డిటెయిల్స్ను ఎప్పుడైనా మార్చుకోవచ్చు.
* మీకు గతంలో వేరే పీఎఫ్ అకౌంట్ ఉంటే దాన్ని కూడా లింక్ చేసుకోవచ్చు.
* అప్డేషన్, నామినేషన్లను ఆన్లైన్లోనే ఫైల్ చేసుకోవచ్చు.