ఎల్ జీ రెండు సరికొత్త స్మార్టు ఫోన్లతో మార్కెట్లోకి వస్తోంది. ఒకటి బడ్జెట్ రేంజ్ కాగా రెండోది హై ఎండ్ మొబైల్. ఇప్పటికే క్లిక్ అయిన తన జీ6 స్మార్ట్ఫోన్కు కొనసాగింపుగా ఎల్ జీ ‘జీ6 ప్లస్' పేరిట మరో నూతన వేరియెంట్ను తాజాగా విడుదల చేసింది. రూ.54,060 ధరకు ఈ ఫోన్ దొరుకుతోంది. దీంతోపాటు జీ6 ఫోన్కు గాను 32జీబీ స్టోరేజ్ వేరియెంట్ను కూడా ఎల్జీ విడుదల చేసింది. దీని ధర రూ.46,275.
అలాగే ఎక్స్ చార్జ్' పేరిట ఎల్జీ ఓ నూతన స్మార్ట్ఫోన్ను త్వరలో విడుదల చేయనుంది. రూ.11,669 ధరకు ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది.
ఎల్జీ జీ6 ప్లస్ స్పెసిఫికేషన్లు
* 5.7 ఇంచ్ క్వాడ్ హెచ్డీ ప్లస్ ఎల్సీడీ డిస్ప్లే
* 1440 x 2880 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* క్వాడ్కోర్ స్నాప్డ్రాగన్ 821 ప్రాసెసర్
* 4 జీబీ ర్యామ్
* 128 జీబీ స్టోరేజ్
* 2 టీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 7.0 నూగట్
* 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
* 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
* ఫింగర్ప్రింట్ సెన్సార్
* ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్
* 4జీ ఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ
* ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్ సి, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ
* క్విక్ చార్జ్ 3.0, వైర్లెస్ చార్జింగ్.
ఎల్జీ ఎక్స్ చార్జ్ స్పెసిఫికేషన్లు
* 5.5 ఇంచ్ హెచ్డీ డిస్ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* 1.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్
* 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
* 4జీ ఎల్టీఈ, బ్లూటూత్ 4.2
* ఎన్ఎఫ్సీ, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.