• తాజా వార్తలు

ఒక్క రోజులో ల‌క్ష ఫోన్లు అమ్మ‌కం..  దుమ్మురేపిన మోటో ఈ4 ప్ల‌స్ 


 మోటరోలాను సొంతం చేసుకున్న లెనోవో త‌న లేటెస్ట్ మోడ‌ల్ ఫోన్ మోటో ఈ4 ప్ల‌స్‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. జులై 12న ఈ ఫోన్ రిలీజైన‌ప్ప‌టి నుంచి 24 గంట‌ల్లో ఏకంగా ల‌క్ష ఫోన్లు అమ్మింది.  ఈకామ‌ర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో దీన్ని సేల్‌కు పెట్ట‌గా ఒక్క రోజులోనే ల‌క్ష హ్యాండ్‌సెట్లు అమ్మిన‌ట్లు ఫ్లిప్‌కార్ట్  అనౌన్స్ చేసింది.  ల‌క్ష‌న్న‌ర మంది ఈ ప్రొడక్ట్ పేజీని చూశార‌ని చెప్పింది. ఈ ర‌కంగా చూసినా ఓ ఈ కామ‌ర్స్ వెబ్‌సైట్‌లో చూసిన ప్రొడ‌క్ట్‌ను ఇంత భారీ స్థాయిలో కొన‌డం రికార్డే.  అంతేకాదు మొద‌టి  గంటలో నిమిషానికి 580 ఫోన్లు అమ్ముడయ్యాయట‌. అంటే ఆ ఒక్క గంట‌లోనే దాదాపు 35వేల ఫోన్లు అమ్మారు.  
బ్యాట‌రీయే పెద్ద ప్ల‌స్‌పాయింట్‌
5000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో రూపొందిన ఈ మోడల్‌ ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే దాదాపు రెండు రోజుల పాటు వినియోగించుకోవచ్చని కంపెనీ చెబుతోంది.  5.5 అంగుళాల స్క్రీన్‌కు 2.5డి కర్వ్‌డ్‌ గ్లాస్‌ను అమర్చారు.  క్వాడ్‌ కోర్‌ ప్రాసెసర్‌, 3 జీబీ ర్యామ్‌, 32జీబీ  ఇంట‌ర్న‌ల్ మెమ‌రీ,  13 మెగాపిక్సల్ రియ‌ర్  కెమెరా,  5 ఎంపీ ఫ్రంట్ కెమెరాతోపాటు మ్యూజిక్ ల‌వ‌ర్స్ కోసం  డాల్బీ అట్మాస్‌ ఫీచర్ ఉంది.  ధ‌ర కూడా 9,999 రూపాయ‌లే కావ‌డంతో ఈ ఫోన్‌కు మంచి ఓపెనింగ్స్ వ‌చ్చాయి. పెర్‌ఫార్మెన్స్ ఎలా ఉంటుంద‌న్న‌ది వేచి చూడాల్సిందే.