మోటరోలాను సొంతం చేసుకున్న లెనోవో తన లేటెస్ట్ మోడల్ ఫోన్ మోటో ఈ4 ప్లస్తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. జులై 12న ఈ ఫోన్ రిలీజైనప్పటి నుంచి 24 గంటల్లో ఏకంగా లక్ష ఫోన్లు అమ్మింది. ఈకామర్స్ సైట్ ఫ్లిప్కార్ట్లో దీన్ని సేల్కు పెట్టగా ఒక్క రోజులోనే లక్ష హ్యాండ్సెట్లు అమ్మినట్లు ఫ్లిప్కార్ట్ అనౌన్స్ చేసింది. లక్షన్నర మంది ఈ ప్రొడక్ట్ పేజీని చూశారని చెప్పింది. ఈ రకంగా చూసినా ఓ ఈ కామర్స్ వెబ్సైట్లో చూసిన ప్రొడక్ట్ను ఇంత భారీ స్థాయిలో కొనడం రికార్డే. అంతేకాదు మొదటి గంటలో నిమిషానికి 580 ఫోన్లు అమ్ముడయ్యాయట. అంటే ఆ ఒక్క గంటలోనే దాదాపు 35వేల ఫోన్లు అమ్మారు.
బ్యాటరీయే పెద్ద ప్లస్పాయింట్
5000 ఎంఏహెచ్ బ్యాటరీతో రూపొందిన ఈ మోడల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు రెండు రోజుల పాటు వినియోగించుకోవచ్చని కంపెనీ చెబుతోంది. 5.5 అంగుళాల స్క్రీన్కు 2.5డి కర్వ్డ్ గ్లాస్ను అమర్చారు. క్వాడ్ కోర్ ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ మెమరీ, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరాతోపాటు మ్యూజిక్ లవర్స్ కోసం డాల్బీ అట్మాస్ ఫీచర్ ఉంది. ధర కూడా 9,999 రూపాయలే కావడంతో ఈ ఫోన్కు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందన్నది వేచి చూడాల్సిందే.