కొరియన్ స్మార్ట్ఫోన్ దిగ్గజం శాంసంగ్ ఇండియన్ మార్కెట్లో పట్టు పెంచుకోవడానికి వేగంగా అడుగులు వేస్తోంది. గెలాక్సీ ఎస్8, ఎస్8+ పేరిట
రెండు ఫ్లాగ్షిప్ ఫోన్ల ను గత నెల రిలీజ్ చేసింది. ఇప్పుడు మిడ్ రేంజ్ బడ్జెట్ సెగ్మెంట్లో గెలాక్సీ జే7 మ్యాక్స్, గెలాక్సీ జే7 ప్రో పేరుతో మరో
రెండు కొత్త మోడల్స్ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. గెలాక్సీ జే7 మ్యాక్స్ ధర 17,900 రూపాయలు కాగా జే 7 ప్రో 20,900 రూపాయలకు
దొరుకుతుంది. ఈ కొత్త మోడల్ గెలాక్సీ ఫోన్లతో పేటీఎం మాదిరిగా ఉండే శాంసంగ్ పే మినీ పేమెంట్ సొల్యూషన్ ను ఇండియాలో లాంచ్ చేసింది.
జియో నుంచి డబుల్ డేటా ఆఫర్
గెలాక్సీ జే7 మ్యాక్స్ జూన్ 20 నుంచి ఇండియన్ మార్కెట్లో లభిస్తుంది. జే 7 ప్రో మాత్రం వచ్చే నెలలోనే మార్కెట్లోకి రానుంది. ఈ ఫోన్
కొనుగోలుచేసిన రిలయన్స్ జియో కస్టమర్లకు డబుల్ డేటా ఆఫర్ కింద 120 జీబీఎక్స్ట్రా డేటాను ఇవ్వనున్నట్లు శాంసంగ్ ప్రకటించింది. నెలకు
309 రూపాయలతో రీ ఛార్జి చేయించుకుంటే ఎక్స్ట్రా మరో 10జీబీ డేటాను ఇవ్వనుంది. ఏడాదిపాటు ఈ ఎక్స్ట్రా డేటా ఆఫర్ ఉంటుంది.
ఇవీ స్పెసిఫికేషన్లు
గెలాక్సీ జే7 మ్యాక్స్
* 1920x1080 పిక్సెల్స్ స్క్రీన్ రెజుల్యూషన్తో 5.7 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ ప్లే
* ఆక్టా-కోర్ మీడియాటెక్ ఎంటీ6757వీ ప్రాసెసర్
* 4జీబీ ర్యామ్
* 32జీబీ ఇన్బిల్ట్ స్టోరేజ్ (ఎస్డీ కార్డుతో ఎక్సపాండబుల్)
* 13ఎంపీ మెగాపిక్సెల్స్ రియర్, ఫ్రంట్ కెమెరాలు
* 3,300ఎంఏహెచ్ బ్యాటరీ
* ఆండ్రాయిడ్ నూగట్ ఓఎస్
గెలాక్సీ జే7 ప్రొ
* 1080 పిక్సెల్ రిజల్యూషన్తో 5.5 ఇంచెస్ ఫుల్ హెచ్డీ సూపర్ అమౌల్డ్ డిస్ప్లే
* 1.6గిగా హెర్ట్జ్ ఎక్సీనోస్ 7870 ప్రాసెసర్
* 13 ఎంపీ ఫ్రంట్, రియర్ కెమెరాలు
* 3జీబీ ర్యామ్
* 64 జీబీ ఇన్బిల్డ్ స్టోరేజ్ విత్ ఎక్స్పాండబుల్ మెమరీ ఆప్షన్
* 3,600 ఎంఏహెచ్ బ్యాటరీ
* ఆండ్రాయిడ్ 7.0 నూగట్ ఓఎస్