ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఇప్పుడిప్పుడే వేళ్లూనుకుంటున్న నూబియా సంస్థ అందుబాటు ధరలో, అదిరిపోయే ఫీచర్లతో కొత్త స్మార్టు ఫోన్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. 'ఎన్2స పేరిట విడుదల చేసిన ఈ ఫోన్ ధర రూ.15,999. స్మార్టు ఫోన్లలో అతి పెద్ద సమస్య అయిన బ్యాటరీ సమస్య దీనికి తలెత్తకుండా ఏకంగా 5000 ఎంఏహెచ్ బ్యాటరీని దీనికి అమర్చారు.
ఇప్పటికే ఇండియాలో విడుదలైన నూబియా ఫోన్లకు పెద్దగా ఆదరణ దక్కకపోవడంతో ఇప్పుడీ ఫోన్ పైనా పెద్దగా అంచనాలు లేవు. కానీ... ఫీచర్లు, ధర పోల్చుకుంటే కొనదగ్గ ఫోనని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. దీనికి ఫాస్ట్ చార్జింగ్ ఆప్షన్ కూడా ఉంది. అయితే.. ఈ ఫోన్లో ఫీచర్లన్నీ లేటెస్ట్ మొబైల్స్ కు ధీటుగా ఉన్నప్పటికీ ఓఎస్ మాత్రం ఆండ్రాయిడ్ నౌగాట్ కాకుండా మార్ష్ మాల్ ఇచ్చారు.
ఇవీ స్పెసిఫికేషన్ల
* 5.5 ఇంచ్ హెచ్డీ అమోలెడ్ 2.5డి కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే
* 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* 1.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్
* 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో
* హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
* 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా
* 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
* ఫింగర్ప్రింట్ సెన్సార్
* 4జీ వీవోఎల్టీఈ
* బ్లూటూత్ 4.0
* యూఎస్బీ టైప్ సి
* 5000 ఎంఏహెచ్ బ్యాటరీ