మైక్రోసాఫ్ట్ వైట్ స్పేస్! ఈ పేరు ఎక్కడా విన్నట్లు లేదు కదా! కానీ ఇది భారత్లో చాలా ప్రాంతాల్లో ఉపయోగిస్తున్నారు. కానీ కొద్దిమందికి మాత్రమే దీని గురించి అవగాహన ఉంది. వేగవంతమైన ఇంటర్నెట్ కోసం మైక్రోసాఫ్ట్ వైట్ స్పేస్ను ఒక ఫ్లాట్ఫామ్గా ఉపయోగిస్తున్నారు. ఇదో ప్రత్యేక్యమైన స్పెక్ట్రమ్గా ఉపయోగపడుతోంది. ఇంతవరకు బాగానే ఉంది. దేశంలో కొంతమందికైనా వేగంగా ఇంటర్నెట్ అందుతోంది అనే భావన ఒకే.. కానీ ఇది దేశ భద్రతకు ముప్పుగా పరిణమిస్తోందని ఇంటిలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. మరి ఎందుకు వైట్ స్పేస్ ప్రమాదకరంగా మారుతోంది?.. కారణం ఏమిటి?
తక్కువ ధర.. ఎక్కువ స్పీడ్
ఇంటర్నెట్ వాడేవాళ్లు ఏం కోరుకుంటారు? తక్కువ ధరలో ఎక్కువ స్పీడ్ కావాలని అనుకుంటారు. మైక్రోసాఫ్ట్ వైట్ స్పేస్ చేస్తుంది ఇదే. తక్కువ ధరకే రాకెట్ స్పీడ్తో నెట్ సేవలు అందిస్తోంది. గత రెండేళ్లుగా వైట్ స్పేస్ బాగా విస్తరించింది. ముఖ్యంగా రూరల్ ఏరియాల్లో దీని ప్రాబల్యం ఎక్కువగా ఉంది. తక్కువ ధరతో ఎక్కువ స్పీడ్ ఇస్తుండడంతో రూరల్ ఏరియాల్లో ఎక్కువమంది దీనికి అలవాటుపడ్డారు. అయితే ఇదే టెక్నాలజీ జాతీయ భద్రతకు ముప్పుగా మారిందని ఇంటిలిజెన్స్ బ్యూరో చెబుతోంది. వైస్ స్పేస్ది ప్రత్యేకమైన స్పెక్ట్రమ్ కావడమే దీనికి కారణం. భారత టెలికాం శాఖ, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టరీ నియంత్రణలో లేకపోవడంతో సంఘ వ్యతిరేక శక్తులు, తీవ్ర వాదులు ఈ నెట్ వాడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
జియో వాడండి..
మైక్రోసాఫ్ట్ వైట్ స్పేస్ నెట్ వాడొద్దు. రిలయన్స్ జియో ఉపయోగించండి అని రక్షణ శాఖ పౌరులకు విన్నవించింది. ప్రస్తుతం మహారాష్ట్రలో దీని వినియోగం ఎక్కువగా ఉంది. ఎవరైనా సరే జియోకు మారిపోవాలని రక్షణ శాఖ కోరుతోంది. అంతేకాక ఈ సేవలను ఆపేయాల్సిందిగా మైక్రోసాఫ్ట్కు కూడా లేఖ రాసింది. దీని వల్ల ఉగ్రవాదులు ఈ నెట్ వాడకుండా నిరోధించాలనేది ప్రభుత్వం ప్రయత్నం. మైక్రోసాఫ్ట్ కూడా సానుకూలంగా స్పందించింది. తమ సేవల్ని నెమ్మది నెమ్మదిగా ఉపసంహరించుకుంటామని తెలిపింది.