ఇటీవలే జీ6 ఫోన్ ను లాంచ్ చేసి ఊపు మీదున్న ఎల్ జీ మరో స్మార్టు ఫోన్ విడుదల చేయడానికి సిద్ధమైపోయింది. ఎల్జీ 'ఎక్స్ వెంచర్' పేరిట ఓ నూతన స్మార్ట్ఫోన్ను ఈ నెల 26వ తేదీన విడుదల చేయనుంది. ముందుగా ఈ ఫోన్ అమెరికా మార్కెట్లో అందుబాటులోకి రానుంది. ఆ తరువాత ఇతర దేశాల్లోనూ ఈ ఫోన్ లభ్యం కానుంది. మన దగ్గర ఈ ఫోన్ను యూజర్లు రూ.21,375 ధరకు కొనుగోలు చేయవచ్చు.
మిగతా ఎల్ జీ ఫోన్లకు భిన్నంగా ఇది రఫ్ యూజ్ కు పనికొస్తుంది. వాటర్ ప్రూఫ్ కావడమే కాకుండా 14 రకాల మిలట్రీ టఫ్ నెస్ టెస్టులను పాస్ అయింది. ఫోన్ లుక్ కూడా రగ్గ్ డ్ గానే ఉంది. దీని రగ్గ్ డ్ ఎస్క్యూ మెటల్ అత్యంత ధృఢంగా ఉంటుంది . ప్రధానంగా అవుట్ డోర్, అడ్వంచర్ మోడల్ కాబట్టి అందుకు తగ్గట్లుగానే ఇందులో కొన్ని ప్రత్యేకమైన యాప్స్ ఇన్ బిల్ట్ గా ఇస్తున్నారు. యాక్టివిటీ కౌంటర్, ఎక్సర్ సైజ్ ట్రాకర్, వెదర్ రిపోర్టర్, ఫ్లాష్ లైట్ వంటివి ఉన్నాయి.
ఇవీ స్పెసిఫికేషన్లు
5.2 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే
1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆక్టాకోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్
32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 7.0 నూగట్, డ్యుయల్ సిమ్
16 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్టీఈ
డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ
4100 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 2.0