ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ మనకు ఎన్నో రకాల సేవలు అందిస్తోంది. అందులో యాడ్స్ ఒకటి. మన కంటెంట్కు తగ్గ యాడ్లను ఇది ఎప్పడికప్పుడు ఇస్తుంది. అంతేకాదు మనం జీమెయిల్లో జరిగే డిస్కషన్స్ ఆధారంగా, మనం ఎక్కువగా పంపే మెయిల్స్ ప్రకారం ఆ తరహా యాడ్స్ను డిస్ప్లే చేస్తుంది గూగుల్. అయితే యాడ్స్ కోసం ఇకపై జీమెయిల్ను చూడబోమని ఇటీవలే గూగుల్ ప్రకటించింది. 2004లో జీమెయిల్ మొదలు పెట్టాక.. కంటెంట్ను పరిశీలించడం.. దానికి తగ్గట్టుగా యాడ్స్ను ఇవ్వడం అనేది గూగుల్కు కార్యకలాపాల్లో మమూలైపోయింది. ఐతే తాజాగా ఆ సంస్థ.. ఆ ప్రాక్టీస్కు చెక్ పెట్టాలని నిర్ణయించింది. మరి గూగుల్ను నమ్మొచ్చా?
గోప్యతకు భంగం వాటిల్లుతుందని..
ప్రపంచంలో ఎక్కువమంది ఉపయోగించే మెయిల్స్లో జీమెయిల్ అగ్రస్థానంలో ఉంటుంది. ఎందుకంటే దీనిపై ఉన్న నమ్మకం అలాంటిది కాబట్టి. అందుకే ఈ మెయిల్ ద్వారా ఎన్నో విషయాలను మనం పంపుతుంటాం. ఇంపార్టెంట్ డాక్యుమెంట్లతో పాటు ఫొటోలను కూడా పంపిస్తుంటాం. వీటిలో చాలా సున్నితమైన సమాచారం కూడా ఉంటుంది. మరి అలాంటి స్థితిలో గూగుల్ మన సమాచారంపై ఒక కన్నేస్తే గోప్యత ఎక్కవ ఉంటుంది? అసలు మన జీమెయిల్ సేఫ్ అన్న ఫీలింగ్ ఎలా కలుగుతుంది. చాలామంది గూగుల్ కార్యకలాపాల గురించి తెలియదు. కానీ తెలిసిన వాళ్లు ఊరికే ఉండలేకపోతున్నారు. దీంతో కొంతమంది ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే గూగుల్ తాజా నిర్ణయం తీసుకుంది.
యాడ్స్ ఆగవు
అయితే మన మెయిల్ చుట్టూ పక్కల యాడ్స్ ఉంటాయి. మనం ఆ విషయాన్ని ఎక్కువగా పట్టించుకోం. తాజా పరిణామంతో గూగుల్ మెయిల్ కంటెంట్ను చూడకూడదని నిర్ణయించుకుంది. కానీ యాడ్స్ మాత్రం ఎప్పటిలాగే ఉంటాయని చెప్పింది. ఈమెయిల్ కంటెంట్ను స్కాన్ చేయకుండా.. ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ఇతర సిగ్నల్స్ ఆధారంగా.. సంబంధిత యాడ్స్ను ప్లేస్ చేయాలని గూగుల్ నిర్ణయించింది. 1.2 బిలియన్ జీమెయిల్ యూజర్లందరికి యాడ్స్ కనిపించవు. అయితే వారిలో కొందరికి ప్రత్యేక సిగ్నల్స్ ద్వారానే యాడ్స్ ప్లేసింగ్ ఉంటుంది. ఐతే పెయిడ్ జీమెయిల్స్లో యాడ్స్ ఉండవని గూగుల్ చెప్పింది. తాము ఎవరి డాక్యుమెంట్లను స్కాన్ చేయమని.. వదంతులను నమ్మొద్దని ఆ సంస్థ చెప్పింది.ల