వీసాల జారీలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు రోజురోజుకీ వివాదాస్పదమవుతున్నాయి. తాజాగా వీసాలకు, సోషల్ మీడియా అకౌంట్లకు లింకు పెట్టారు.
అభ్యర్థులు ఇకపై వీసా పొందాలంటే తమ సామాజిక మాధ్యమాల వివరాలు వె ల్ల డించాలని సరికొత్త నిబంధనను తెరపైకి తెచ్చింది ట్రంప్ ప్రభుత్వం. తద్వారా ఉగ్ర కార్యకలాపాలు తదితర జాతి భద్రతకు భంగం కలిగించే విదేశీయులను నియంత్రించవచ్చన్నది ఆలోచన. ఈ మేరకు ప్రభుత్వ విభాగం వీసాదారులను అడగాలనుకొంటున్న కొన్ని ప్రశ్నలతో ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది.
పాస్ వర్డ్స్ ఇవ్వక్కర్లేదు
ఈ సోషల్ మీడియా నిబంధన ప్రభావం ఏడాదికి 65 వేల మంది అభ్యర్థులపై ఈ ప్రభావం పడుతుందని అంచనా. ఇవే కాకుండా అభ్యర్థులు తమ జాతీయ, అంతర్జాతీయ ‘ట్రావెల్ హిస్టరీ’కూడా వెల్లడించాల్సి ఉంటుంది. ‘ఒకవేళ అభ్యర్థి ఉగ్రవాదుల అధీనంలోని ప్రాంతాన్ని సందర్శించినట్టయితే, అక్కడికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది తదితర వివరాలు దౌత్య అధికారికి తెలపాలి. అవసరమనుకుంటే ఆధారాలు ఇవ్వాలి. అయితే... ప్రైవసీకి భంగం కలిగించే పాస్వర్డ్స్ వంటివి ఇవ్వక్కర్లేదు.