డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి ఇండియన్ టెక్కీలకు కష్టాలు మొదలయ్యాయి. అమెరికన్లకు రావాల్సిన జాబ్లను ఇండియన్లతోపాటు ఇతర దేశాల యూత్ కొట్టేస్తున్నారంటూ ఎలక్షన్ క్యాంపెయిన్లలో పదేపదే చెప్పి లోకల్ ఫీలింగ్ రగిలించి ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ అయిపోయారు. అప్పటి నుంచి హెచ్1బీ వీసా రూల్స్ను రోజురోజుకీ స్ట్రిక్ట్ చేసేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలు ఆలోచనలో పడ్డాయి. లోకల్ అమెరికన్స్కే జాబ్లిస్తే ఏ గొడవా ఉండదు కదా అని భావిస్తున్నాయి. ఇండియన్లకో మరో కంట్రీకో చెందిన టెక్ నిపుణులకో జాబ్ ఇస్తే రేపు వీసా ప్రాబ్లమ్స్ వస్తే ఎందుకొచ్చిన హెడేక్ అని భావిస్తున్నాయి. తాజాగా ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కూడా అమెరికాలో స్థానికులనే మరింత మందికి జాబ్లివ్వడంపై దృష్టి పెట్టింది. లోకల్ అమెరికన్లకు ట్రయినింగ్ కోసం సెంటర్లు కూడా పెట్టే పనిలో ఉంది.
ఖర్చు పెరిగినా తప్పదు
లోకల్ అమెరికన్ల కంటే చాలా తక్కువ శాలరీకే ఇండియా వంటి ఇతర కంట్రీల టెక్కీలు అమెరికాలోని కంపెనీల్లో పని చేస్తారు. అందుకే మన దేశం నుంచి టెక్నాలజీ ఎక్స్పర్ట్లు ఎక్కువగా అమెరికా వంటి దేశాలకు వెళ్లి జాబ్లు చేయగలుగుతున్నారు. ఇండియా నుంచి 4 లక్షల మందికి పైగా టెక్ ఎక్స్పర్ట్లు అమెరికాలో ఉన్న ఇన్ఫోసిస్ వంటి ఇండియన్ కంపెనీలతోపాటు మైక్రోసాఫ్ట్ వంటి అమెరికన్ టెక్ జెయింట్ల దగ్గర కూడా భారీ స్థాయిలో జాబ్లు పొందుతున్నారు. కానీ ట్రంప్ వచ్చాక వీసా రూల్స్ మరీ టఫ్గా మారిపోతుండడంతో కంపెనీలూ రూట్ మార్చేస్తున్నాయి.. లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మేం లోకల్స్ను జాబ్ల్లోకి తీసుకోవడంపై దృష్టి పెట్టాం అని ఇన్ఫోసిస్ సీఓఓ ప్రవీణ్రావు ఇటీవల ఓ ఇన్వెస్టర్ల సమ్మిట్లో చెప్పారు. ఈ విధానాన్ని కంటిన్యూ చేస్తామన్నారు. స్థానికులకు జాబ్లివ్వడంతోపాటు డెవలప్మెంట్, ట్రయినింగ్ సెంటర్లను కూడా పెడతామన్నారు.
ఇదీ కారణం
హెచ్ 1 బీ వీసాపై వచ్చి టెక్నాలజీ ఇండస్ట్రీలో పనిచేసేవారికి ఏడాదికి శాలరీని 60 వేల డాలర్ల నుంచి లక్షా 30 వేల డాలర్లకు పెంచే బిల్లును యూఎస్ గవర్నమెంట్ ఇటీవల సెనేట్లో ప్రవేశపెట్టింది. అంటే ఇండియన్స్ లేదా ఇతర కంట్రీల నుంచి హెచ్1 బీ వీసాలపై వచ్చినవారికి శాలరీని 100% హైక్ చేసి ఇవ్వాలి. అంత పెంచి ఫారిన్ టెకీల కంటే లోకల్ అమెరికన్స్కే ఇస్తే బెటర్.. గవర్నమెంట్ కూడా జాబ్ చేస్తున్నది తమ అమెరికన్లే కదా అని రూల్స్ మరింత టైట్ చేయకుండా ఉంటుంది కదా అని ఇప్పుడు ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు ఆలోచిస్తున్నాయి. అందుకే లోకల్స్కే ఎక్కువ జాబ్లివ్వడంపై దృష్టి పెడుతున్నాయి.
మనకు నష్టమే
అమెరికాలోనే కాదు ఇండియాలోని సాఫ్ట్వేర్ కంపెనీలపైనా ట్రంప్ ప్రభావం పడుతోంది. హెచ్1 బీ వీసాలను టైట్ చేయడం, బై అమెరికన్.. హైర్ అమెరికన్ అంటూ లోకల్స్కే పని ఇవ్వాలని ట్రంప్ చెబుతుండడంతో అవుట్ సోర్సింగ్ ద్వారా ఇండియాలోని సాఫ్ట్వేర్ కంపెనీలకు వర్క్ ఇచ్చే కంపెనీలు ఆలోచనలో పడుతున్నాయి. దీంతో గత ఆరేడు నెలలుగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో లాభాలు తగ్గాయని నాస్కామ్ చెప్పింది. ఇండియాలో దాదాపు 40 లక్షల మంది ఐటీ, ఐటీ బేస్డ్ జాబ్స్ చేస్తున్నారు. అమెరికన్ వీసాలు టైట్ అవుతుండడం, బ్రెగ్జిట్ నుంచి బ్రిటన్ బయటికి రావడం వంటి కారణాలతో మన ఐటీ రంగంపై చాలా ఎఫెక్ట్ పడుతుంది.