3 లక్షల ప్రభుత్వ ఉద్యోగులకు స్థిరమైన ఐపి అడ్రస్ లేదా VPN లేదా వన్ టైం పాస్ వర్డ్ తప్పనిసరి తెలంగాణా ప్రభుత్వం ఒక ఎక్స్ క్లూజివ్ ఈ మెయిల్ పాలసీ ముందుకు తీసుకు వచ్చింది. వచ్చే నెలనుండీ ఇది అమలు లోనికి రానుంది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మధ్య జరిగే ఈ మెయిల్ సంభాషణల్లో ఒక సురక్షితమైన వాతావరణాన్ని తీసుకు రాబోతుంది . కొత్త ఈ మెయిల్ పాలసీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అధికారులందరూ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (NIC) చే ఇవ్వబడిన అధికారిక ఈ మెయిల్ లను మాత్రమే వాడవలెను. ఇది రాష్ట్ర ప్రభుత్వ అధికారులందరికీ తప్పనిసరి చేయడమే గాక , రాష్ట్ర ఐటి మంత్రిత్వశాఖ ఈ అంశం పై వచ్చే వారం నుండి రాష్ట్ర ప్రభుత్వం లోని 33 శాఖల అధికారులకూ దీనిపై శిక్షణ ఇవ్వనున్నారు. “ ప్రస్తుతం 60- 70 శాతం మంది సీనియర్ అధికారులు మాత్రమే ప్రభుత్వ కార్యకలాపాలకు అధికారిక ఈ మెయిల్ లను వాడుతున్నారు. మిగతా చిన్న స్థాయి అధికారులందరూ ప్రభుత్వ సంబందిత ఉత్తర ప్రత్యుత్తరాలకు యాహూ,గూగుల్ లాంటి సర్వీస్ ప్రొవైడర్ లపై ఆధార పడుతున్నారు. త్వరలోనే అందరికీ అధికారిక ఈ మెయిల్ లను వాడేలా పురికొల్ప నున్నాము “ అని తెలంగాణా ఐటి విభాగ ముఖ్య కార్యదర్శి అయిన జయేష్ రంజన్ తెలిపారు. ఆయన చెప్పిన దాని ప్రకారం ఈ ప్రక్రియలో రాష్ట్రం లోని అధికార గణం అందరికీ అధికారిక ఈ మెయిల్ ఐడి లను అందించడం ద్వారా ఒక సరికొత్త వ్యవస్థను తెలంగాణా ప్రభుత్వం నెలకొల్ప బోతోంది. ఒక్కసారి ఈ నూతన ఈ మెయిల్ పాలసీ అమలు లోనికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ఈమెయిలు ఐడి కాకుండా వేరే మెయిల్ ఐడి లను వాడుతున్న అధికారులపై ACR (Anual Confidential Reports) తయారయ్యే అవకాశం ఉంది. అంతేగాక ప్రస్తుతం అధికారులు చాలా మంది తమ ఈ మెయిల్ ఎకౌంటు ల నుండి మెయిల్ లను డౌన్ లోడ్ చేసుకుంటున్నారు. కానీ కొత్త మెయిల్ విధానం దీనికి అనుమతించదు. ఎందుకంటే ఈ పాలసీ తన ఎకౌంటు వివరాలను ప్రైవేటు ఈ మెయిల్ సర్వీస్ లకు అందజేయదు. భారత ప్రభుత్వ ఎలేక్ట్రోనిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఆధ్వర్యం లోని NIC ద్వారా అన్ని రాష్ట్రాలకు అధికారిక ఈ మెయిల్ సేవలు అందజేయబడ్డాయి. అధికారుల మరియు ప్రజా ప్రతినిధుల విదేశీ పర్యటనలకు సంబందించిన సమాచారానికి కూడా ఒక స్థిరమైన ఐపి అడ్రస్ లేదా VPN లేదా వన్ టైం పాస్ వర్డ్ ను వాడే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.విదేశాలలో ఎదురయే సెక్యూరిటీ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంతేగాక అధికారులందరూ సరికొత్త ఆపరేటింగ్ సిస్టం లనూ, యాంటీ వైరస్ లను తమ సిస్టం లలో వాడవలసినదిగా కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం లో మొత్తం 3 లక్షల మంది ఉద్యోగులు ఉంటే టైపిస్ట్ లు మరియు ఇతర క్రింది స్థాయి ఉద్యోగులను మినహాయిస్తే మిగతా అధికారులందరికీ ఈ అధికారిక ఈ మెయిల్ లను తప్పనిసరి కాబోతోంది. |