జియో.. ఈ పేరు ఇండియన్ మొబైల్ సెక్టార్లో ఎంత సంచలనం రేపిందో.. ఇంకెంత సంచలనం రేపుతుందో చూస్తూనే ఉన్నాం. ఫ్రీ ఆఫర్లు, ధనాధన్ ప్యాకేజీలతో యూజర్ల కు చేరువైన జియోను అత్యధిక మంది ఎక్కడ వాడుతున్నారో తెలుసా.. ఇంకెవరు మన తెలుగువాళ్లే.
జియో కస్టమర్లున్న అన్ని సర్కిళ్ల కంటే ఆంధ్రప్రదేశ్ సర్కిలే టాప్. ఇక్కడ జియో యూజర్ల సంఖ్య కోటీ ఆరు లక్షలు. అంటే జియోకు ఉన్న ప్రతి 12 మంది కస్టమర్లలో ఒకరు తెలుగువారే. ఇక జియో యజమాని అంబానీ సొంత రాష్ట్రం గుజరాత్లో జియో సబ్స్క్రైబర్ల సంఖ్య 9కోట్ల 10 లక్షలు. 2017 -18 ఫైనాన్షియల్ ఇయర్ తొలి క్వార్టర్ రిజల్ట్స్తో పాటు జియో ఈ డిటైయిల్స్ను బయటపెట్టింది. ఢిల్లీ సర్కిల్లో 84 లక్ష మంది, యూపీ ఈస్ట్లో 79 లక్షల మంది, యూపీ వెస్ట్ సర్కిల్లో 65 లక్షల మంది జియో సబ్స్క్రైబర్లు ఉన్నారు.
మొత్తం 12.30 కోట్ల మంది
జియో ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఏకంగా కోటీ 40 లక్షల మంది కొత్త సబ్ స్క్రైబర్లను సంపాదించుకుంది. దీంతో కలిపి జియో సబ్స్క్రైబర్ల సంఖ్య 12 కోట్ల 30 లక్షలు దాటింది. వీటిలో 10 కోట్ల మంది పెయిడ్ సబ్స్క్రైబర్లేనని జియో ప్రకటించింది. వీరిలో ఎక్కువ మంది 309 రూపాయల హయ్యర్ ప్లాన్నే వాడుతున్నారని చెప్పింది. జియో కస్టమర్లు నెలకు 165 కోట్ల గంటల వీడియోలు వీక్షిస్తున్నారు.