భారత్లో జియో విస్తరించినంత వేగంగా మరే కంపెనీ విస్తరించలేదేమో! కంపెనీ పెట్టిన కొన్ని నెలల్లోనే లక్షల్లో వినియోగదారులు! కోట్లలో బిజినెస్! ఇది రిలయన్స్ జియో కథ. రాను రాను మార్కెట్లో తన బలాన్ని పెంచుకునేందుకు ముఖేశ్ అంబానీ సంస్థ ప్రణాళికలు రచిస్తోంది. కొత్త కొత్త ప్లాన్స్తో వినియోగదారులను తన వైపు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది జియో. ఇప్పటి వరకు జియో షేర్లు కూడా పబ్లిక్ లిస్టింగ్స్ వెళ్లలేదు. కానీ దీని మార్కెట్ విలువ మాత్రం భారీగా ఉంది. దీనికి ఏకైక కారణం ముఖేశ్ అంబానీయే. అయితే ఏడాదిలోనే ఆ సంస్థ 54 పేటెంట్లు ఫైల్ వేసింది. మరి ఇంత తక్కువ కాలంలో ఇన్నిపేటెంట్లు ఫైల్ చేయడం వెనుక మతలబు ఏంటి?
170 రోజులు.. 100 మిలియన్ యూజర్లు
రిలయన్స్ జియో పుట్టి ఇప్పటికి 170 రోజులు అయితే దీనికి 100 మిలియన్ యూజర్లు ఉండడం మరో విశేషం. ఫ్రీ ప్రమోషనల్ ఆఫర్లతో గతేడాది సెప్టెంబర్లో భారత టెలికాం రంగంలో పెను ప్రకంపనలు సృష్టించిన జియో.. తన పోటీదారులు ఎయిర్టెల్, ఐడియా, బీఎస్ఎన్లను ఎప్పుడో దాటేసింది. అందుకే తాను ఏం చేసినా.. ఏం ప్రణాళికలు రచించినా.. వాటన్నిటికి పేటెంట్లు ఫైల్ చేస్తుంది జియో. ఇప్పటి వరకు 22 ప్రత్యేక ప్రణాళికలు అమల్లోకి తెచ్చిన జియో.. వాటన్నిటికి పేటెంట్లు తీసుకుంది. దీనికి కారణం పోటీ సంస్థలు తమ ప్లాన్లను కాపీ కొట్టకుండా ఉండడానికి. ఎవరూ తనకు పోటీగా ఉండకూడదనేది జియో ప్రణాళిక. దీనికి తగ్గట్టే పేటెంట్లు కూడా తీసుకుంటోంది
టార్గెట్ 95 శాతం
అమెరికాతో పోలిస్తే భారత్లో మొబైల్ బ్రాడ్బాండ్ కవరేజీ 75 శాతంగా ఉంది. త్వరలోనే దీన్ని 95 శాతానికి తీసుకు వెళ్లాలనేదే జియో ప్రణాళిక. ఏడాదిలోనే ఈ టార్గెట్ రీచ్ కావాలని జియో భావిస్తోందీ. డేటా వాడకంలో మిగిలిన దేశాలతో పోలిస్తే గతంలో తక్కువగా ఉన్నా భారత్.. జియో రాకతో ఎంతో మెరుగపడిందని ఆ సంస్థ తెలిపింది. అయితే 100 మిలియన్ యూజర్లు సగటున నెలకు 10 జీబీ కంటే ఎక్కువ డేటా ఖర్చు చేయడం అనేది ప్రపంచంలో ఎక్కడా లేదని జియో పేర్కొంది. అంతేకాదని జియో వల్ల 1.4 లక్షల మంది ఉద్యోగాలు పొందారని ఆ సంస్థ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరికి వీరి సంఖ్య 50 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలనేది తమ లక్ష్యమని ఈ సంస్థ పేర్కొంది.