స్మార్టు ఫోన్ సంస్థలు... టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల ఉమ్మడి ఆఫర్లు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ప్రముఖ స్మార్టు ఫోన్ తయారీ సంస్థ జియోనీ సంచలన టెలికాం ఆపరేటర్ జియోతో కలిసి అదిరిపోయే ఆఫర్లను అందిస్తోంది.
ఫ్రీ 4జీ డాటా
జియోనీ ఫోన్లలో జియో సిమ్లను వాడుతున్న వారు రూ.309 ఆపైన ప్యాక్లను రీచార్జి చేసుకుంటే దాంతో వారికి ఉచితంగా 4జీ డేటా ఇస్తున్నారు. జియోనీ పీ5ఎల్, పీ7 ఫోన్లను వాడుతున్న వారికి 2జీబీ 4జీ డేటా లభిస్తుండగా, ఇలైఫ్ ఎస్6, ఇలైఫ్ ఎస్7, మారథాన్ ఎం5, ఎస్ ప్లస్, ఎస్6ఎస్, ఎఫ్103 ప్రొ, ఎం5 లైట్ సీడీఎంఏ, మారథాన్ ఎం4, మారథాన్ ఎం5 లైట్, పీ7 మ్యాక్స్, ఎఫ్103 ఫోన్లను వాడుతున్న వారికి 5జీబీ 4జీ డేటా, ఎ1, ఎం5 ప్లస్, ఎస్6 ప్రొ, ఇలైఫ్ ఇ8 ఫోన్లను వాడుతున్న వారికి 10 జీబీ 4జీ డేటా ఉచితంగా లభిస్తున్నది.
2018 మార్చి వరకు..
అయితే ఈ ఫోన్లను వాడుతున్న వారు మార్చి 31, 2018 వరకు గరిష్టంగా 6 సార్లు రీచార్జి చేసుకోవచ్చు. దీంతో వారికి రూ.309 ఆపైన రీచార్జి చేసుకున్నప్పుడల్లా అదనపు 4జీ డేటా ఉచితంగా లభిస్తుంది.
పేటీఎం వోచర్లు
మరోవైపు కొత్తగా జియోనీ ఎ1 లేదా పీ7 మ్యాక్స్ ఫోన్లను కొనే వారికి రూ.250 విలువ గల పేటీఎం వోచర్లను జియోనీ వైపు నుంచి అందిస్తున్నారు.