శాటిలైట్ ఫోన్ లను సాధారణ పబ్లిక్ వాడడాన్ని బ్యాన్ చేసిన దేశాల్లో ఇండియా ఒకటి. ఉగ్రవాదాలు దీనిని తమకు ఆయుధంగా మార్చుకునే అవకాశం ఉన్నందున పబ్లిక్ కు శాటిలైట్ ఫోన్ ల్పి బ్యాన్ ను ఇండియా విధించింది. అన్ని తరహాల లో ఉన్న కమ్యూనికేషన్ లు ఫెయిల్ అయినపుడు ఇందులో ఉండే అల్ట్రా డిఫెన్సివ్ సేఫ్టీ మెకానిజం అనేది పనిచేస్తుంది. శాటిలైట్ ఫోన్ కి ఉండే ఈ సౌలభ్యంవలన విపత్తు నిర్వహణలో దీనిని ప్రముఖం గా ఉపయోగిస్తారు. ఉదాహరణకు 2015 లో చెన్నై లో వరదలు సంభవించినపుడు రెండు రోజుల పాటు టెలికాం సర్వీస్ లు అన్నీ నిలిచిపోయిన పరిస్థితులలో సహాయ చర్యలకు ఈ శాటిలైట్ ఫోన్ లు ఎంతగానో ఉపయోగపడ్డాయి.
భారత ప్రభుత్వం అందరు పౌరులకు మరో రెండు సంవత్సరాలలో ఈ శాటిలైట్ ఫోన్ సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయం తీసుకుంది.
భారత్ టెలికాం ఇండస్ట్రీ లో ఇది అతి పెద్ద ముందడుగు గా చెప్పుకోవచ్చు. దీనివలన దేశం లోని మారుమూల ప్రాంతాల లో ఉన్న రిమోట్ ఏరియా లు కూడా మిగతా దేశo తో కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. విఅప్ట్టు నిర్వహణ అనేది మరింత వేగం గానూ మరింత సమర్థవంతం గానూ మారనుంది.
గత వారం UK ఆధారిత INMARSAT తో ఇండియా ఒప్పందం చేసుకున్న విషయం గురించి మన వెబ్ సైట్ లో మూడు రోజుల క్రితం ఒక ఆర్టికల్ ను కూడా ఇవ్వడం జరిగింది. భారత టెలికాం డిపార్టుమెంటు నుండి లభించిన లైసెన్స్ ప్రకారం ఢిల్లీ –NCR లోని ఘజియాబాద్ లో ఒక సరికొత్త GPS గేటు వే ప్రారంభించబడింది.ఇది దేశవ్యాప్తంగా BSNL మరియు INMARSAT ల మధ్య శాటిలైట్ సర్వీస్ లను ఎనేబుల్ చేస్తుంది.
ఈ శాటిలైట్ ఫోన్ సర్వీస్ యొక్క కాల్ ఛార్జ్ రూ 35/- గా ఉండే అవకాశం ఉంది.
దీనియొక్క లాంచింగ్ కార్యక్రమం లో INMARSAT ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అయిన గౌతం శర్మ మాట్లాడుతూ అతి త్వరలో అన్ని కనెక్షన్ లు BSNL కు ట్రాన్స్ ఫర్ చేయబడతాయనీ , కాల్ రేట్ లను BSNL నిర్ణయిస్తుందని తెలిపారు. ఇది నిమిషానికి రూ 30-35 /- ల మధ్య ఉండవచ్చని తెలిపారు.
ఫేజ్ ల వారీగా ఇది ఇండియా లో అందరు పౌరులకు అందుబాటులోనికి రానుంది.