జియో ఫీచర్ ఫోన్కు పోటీగా మరో ఫోన్ రంగంలోకి దిగింది. ఇప్పటికే భారతీ ఎయిర్టెల్, కార్బన్ సాయంతో ఫీచర్ ఫోన్ను తీసుకొస్తుండగా... ఈ జాబితాలో ఇప్పు డు బీఎస్ఎన్ఎల్ కూడా చేరింది. మైక్రోమాక్స్ సాయంతో ఆ సంస్థ తాజాగా ఒక ఫీచర్ ఫోన్ను రంగంలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. మైక్రోమాక్స్ అండతో వస్తున్న ఈ ఫీచర్ ఫోన్ పేరు మైక్రోమాక్స్ భారత్ 1 4జీ ఓఎల్టీఈ ఫీచర్ ఫోన్. మరి దీని ప్రత్యేకతలేంటో చూద్దామా..
ధర రూ.2200 మాత్రమే
మైక్రోమాక్స్ తన కొత్త ఫీచర్ ఫోన్ను రూ.2200కే అందిస్తోంది. 4జీ ఎల్టీఈ ఫీచర్ ఉన్న ఈ ఫోన్ను తక్కువ ధరకు అందించి ఎక్కువమంది తనవైపు తిప్పుకోవాలనేది ఆ సంస్థ ఆలోచన. అన్నిటికన్నా ముఖ్యంగా బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న బండిల్డ్ ఆఫర్ కూడా ఈ ఫోన్ను విలువను మరింత పెంచుతోంది. మైక్రోమాక్స్ ఫీచర్ ఫోన్ కోసం బీఎస్ఎన్ఎల్ రూ.97 ప్లాన్ను ప్రత్యేకంగా అందిస్తోంది. ఈ ఆఫర్ వేయించుకుంటే 28 రోజులపాటు అన్లిమిటెడ్ డేటాతో పాటు కాల్స్ ఉపయోగించుకోవచ్చు. రిలయన్స్ రూ.153 ప్లాన్తో పోలిస్తే మైక్రోమాక్స్ ప్లానే ముందంజలోఉంది. ఈ ఆఫర్తో పాటు లైవ్ టీవీ, మూవీస్, మ్యూజిక్ కూడా అందిస్తోంది.
ఏంటీ ఫోన్ ప్రత్యేకతలు?
మైక్రోమాక్స్ భారత్ 1 4జీ వీవోఎల్టీ ఫీచర్ ఫోన్లో అదిరే ఫీచర్లు ఉన్నాయి. 2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్ప్లే, క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 205 ఎస్ఓసీ సాంకేతికత, 512 ఎంబీ ర్యామ్, 4జీబీ ఇంటర్నల్ మెమరీ దీని ప్రత్యేకతలు . ఇదే కాక మిగిలిన ఫీచర్ ఫోన్లతో పోలిస్తే కెమెరా విషయంలో మైక్రోమాక్స్ ముందంజలో ఉంది. 2 ఎంపీ రేర్ కెమెరాతో పాటు వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా దీనిలో ఉన్నాయి. 4జీ వీవోఎల్టీఈకి సపోర్ట్ చేసే ఈ ఫోన్లో 22 లాంగ్వేజెస్తో మనం కనెక్ట్ కావొచ్చు. బ్యాటరీ విషయంలోనూ ఈ ఫోన్ మెరుగ్గానే ఉంది. దీనలో 2000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.