ఫోన్ ఛార్జింగ్.. మనకు చాలా ఇబ్బంది కలిగించే విషయం. అవసరమైనప్పుడు ఫోన్లో ఛార్జింగ్ లేకపోతే మనం పడే బాధ అంతా ఇంతా కాదు. అందుకే ఎప్పుడూ ఛార్జర్ వెంట పెట్టకుని వెళ్లాల్సిన పరిస్థితి. స్మార్టుఫోన్లు వచ్చాక.. ఇంటర్నెంట్ వాడకం ఎక్కవయ్యాక ఛార్జింగ్ ఉండడం అనే కాన్సెప్ట్ లేకుండా పోయింది. ఎందుకంటే ఇంటర్నెట్ వాడితే ఆటోమెటిక్గా ఛార్జింగ్ అయిపోతుంది. అందుకే అందరూ ఎక్కువు ఎంఏహెచ్ బ్యాటరీలు ఉన్న స్మార్టుఫోన్లను కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఇప్పుడు మీ ఛార్జింగ్ అయితే కాస్త అటు ఇటు నడిస్తే చాలు! ఇదేంటి కొత్తగా అని అనుకుంటున్నారా? కొత్తగా వచ్చిన టెక్నాలజీతో ఇది సాధ్యమే మరి.
కదిలినా.. చేతులు ఆడించినా..
సాధారణంగా ఫోన్ ఛార్జింగ్ కావాలంటే ఏం చేస్తాం? ఒక ప్లగ్ వెతుక్కుని దానికి సెట్ చేసుకుంటాం. కానీ తాజాగా సైంటిస్టులు డెవలప్ చేసిన టెక్నాలజీతో ప్లగ్లు అవసరం లేదు.. జస్ట్ మన చేతులు, కాళ్లు కదిలిస్తే చాలు. అంటే ఫోన్ను ఒక చోట పెట్టి మనం అటు ఇటు తిరిగినా చాలు ఛార్జింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. ఇదెలా సాధ్యం! వాండెర్బిల్ట్ యూనివర్సిటీకి చెందిన సైంటిస్టులు మనుషుల కదలికలను బట్టి ఫోన్ ఛార్జింగ్ అయ్యే కొత్త టెక్నాలజీని కనిపెట్టారు. ఆల్ట్రా థిన్ ఎనర్జీ హార్వెస్టింగ్ సిస్టమ్ ఆధారంగా ఇది పని చేస్తుంది. దీని వల్ల వాకింగ్, స్టాండింగ్, కదలికల ద్వారా జనరేట్ అయ్యే శక్తిని బ్యాటరీకి పాస్ చేసి ఎనర్జీగా మారుస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మనుషులు ఎనర్జీ కేంద్రాలుగా మారతారు.
ఛార్జింగ్ కోసం రోబోల సాయం
స్మార్ట్ఫోన్లను ఛార్జింగ్ చేయడానికి మరో కొత్త టెక్నాలజీ వచ్చింది. అదే రోబో ఛార్జింగ్. మనం ఎయిర్పోర్టులు, షాపింగ్ మాల్స్ లాంటి పబ్లిక్ ప్లేసులకు వెళ్లినప్పుడు రోబోల ద్వారా ఛార్జింగ్ చేసుకోవచ్చు. మనకు ఛార్జింగ్ అవసరాన్ని చెబితే రోబోలే మన దగ్గరకు వచ్చి ఛార్జింగ్ చేస్తాయి. ఈ కొత్త టెక్నాలజీకి పేటెంట్ హక్కులను అమేజాన్ సంస్థ తీసుకుంది. దీని కోసం మన స్మార్ట్ఫోన్లోనే ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సమన్ ఏ రోబో పేరుతో ఉండే ఈ యాప్ను ఉపయోగిస్తే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఛార్జింగ్ చేసుకునే అవకాశం ఉంటుందట.