అత్యధిక ధరలు ఉన్న ఫోన్లలో ఐఫోన్, శాంసంగ్ మధ్య పోటీ హోరాహోరీగా నడుస్తోంది. ఈ రెండు కంపెనీలు ఒకటితో ఒకటి పోటీగా కొత్త ఉత్పత్తులను రంగంలోకి దింపుతూనే ఉన్నాయి. తాజాగా ఈ ఏడాది యాపిల్ కంపెనీ ఐ ఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ ఎక్స్ మోడల్స్ను లాంఛ్ చేస్తే.. శాంసంగ్ గెలాక్సీ ఎస్8, ఎస్ 8ప్లస్, గెలాక్సీ నోట్ 8 మోడల్స్ను రంగంలోకి దింపింది. అయితే ఈ ఏడాది తన సొంత స్మార్ట్ఫోన్లతో కన్నా ఐఫోన్ ఎక్స్ ద్వారానే శాంసంగ్ లాభాలు గడించింది. ఐఫోన్ ఎక్స్ ద్వారా శాంసంగ్ ఏకంగా 4 బిలియన్ డాలర్లు లాభాలను మూట గట్టుకుంది. ఇదెలా సాధ్యం అయింది?
ఐ ఫోన్ పార్ట్లు వయా శాంసంగ్
ఐఫోన్ తయారీకి ఎక్కువశాతం పార్ట్లను తయారు చేసేది శాంసంగే. ఈ కొరియాకు చెందిన కంపెనీ గంప గుత్తన ఐఫోన్ విడి భాగాలను సరఫరా చేయడానికి ఒప్పందం చేసుకుంది. ముఖ్యంగా ఐఫోన్ ఎక్స్ పార్ట్లను చేసి ఇచ్చినందుకు శాంసంగ్ 4 బిలియన్ డాలర్లు సంపాదించింది. అంటే ఇది గెలాక్సీ ఎస్8 విడి భాగాల తయారీకి అయ్యే ఖర్చు కన్నా చాలా ఎక్కవే. ఇప్పుడు శాంసంగ్ దృష్టంతా తన సొంత ఫోన్ల తయారీ కన్నా.. ఒప్పందం చేసుకున్న యాపిల్ ఫోన్ల మీదే ఉంది. యాపిల్ త్వరలోనే ఈ ఫోన్లను అమ్మకానికి పెట్టనుంది. ప్రపంచ వ్యాప్తంగా 130 మిలియన్ల ఐఫోన్ ఎక్స్ ఫోన్లను అమ్మే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఒక్కో డివైజ్కు 110 డాలర్లు
మేకింగ్ చేసినందుకు ప్రతి ఐ ఫోన్ ఎక్స్ డివైజ్కు 110 డాలర్ల ఛార్జ్ చేస్తుంది శాంసంగ్. అదే శాసంగ్ గెలాక్సీ ఎస్8 తయారీకి ఆ సంస్థకు 202 డాలర్ల ఖర్చు అవుతుంది. అయితే ఇవి 50 మిలియన్ల యూనిట్లు మాత్రమే అమ్ముడుపోతాయి. గతంలో యాపిల్ సీఈవో స్టీవ్ జాబ్స్... శాంసంగ్ అధినేత లీ జీ యంగ్ కలిసి ఐ ప్యాడ్ల విషయంలో ఒప్పందం చేసుకున్నారు. తాజాగా ఐ ఫోన్ ఎక్స్ డివైజ్ల విషయంలో డీల్ కుదిరింది. ఓఎల్ఈడీ స్క్రీన్లు, ఫ్లాష్ మెమరీ లాంటి టెక్నాలజీ విషయంలో యాపిల్.. శాంసంగ్ మీదే ఆధారపడుతోంది.