షియోమీ నుంచి మరో స్మార్ట్ఫోన్ రిలీజైంది. ఎంఐ మ్యాక్స్ 2 పేరిట కొద్దిసేపటి కిందట మరో మోడల్ ను షియోమీ ఇండియాలో లాంఛ్ చేసింది. పూర్తిగా మెటల్ బాడీతో తయారు చేసిన ఈ ఫోన్ ను ఈ నెల 20, 21 తేదీల్లో ప్రత్యేక సేల్స్ లో పెట్టనున్నారు. 27వ తేదీ నుంచి ఆన్ లైన్ , ఆఫ్ లైన్ స్టోర్లలో ఓపెన్ సేల్స్ ఉంటుంది.
64/128 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో విడుదలైన ఈ ఫోన్ వరుసగా రూ.16,999, రూ.19,999 ధరలకు వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు షియోమీ ఫోన్లు కేవలం ఆన్లైన్లో అదీ ఫ్లాష్ సేల్లో మాత్రమే లభ్యం కాగా, ఇప్పుడు కొత్తగా విడుదలైన ఎంఐ మ్యాక్స్ 2 ఫోన్ ఆఫ్లైన్ స్టోర్స్లోనూ లభ్యం కానుంది.
జియో ఆఫర్..
ఈ ఫోన్ కొన్న వినియోగదారులకు 100 జీబీ 4జీ డాటా ఉచితంగా ఇస్తున్నారు.
షియోమీ ఎంఐ మ్యాక్స్ 2 స్పెసిఫికేషన్లు
* 6.44 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్
* 4 జీబీ ర్యామ్, 64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్
* డ్యుయల్ సిమ్
* ఆండ్రాయిడ్ 7.0 నూగట్
* 4జీ వీవోఎల్టీఈ
* 12 మెగాపిక్సల్ రియల్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
* డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2
* ఫింగర్ప్రింట్ సెన్సార్, యూఎస్బీ టైప్ సి
* 5300 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 3.0.