ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ పండగలు, స్పెషల్ డేస్లో చాలా ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా కిడ్స్ కార్నివాల్స్ను నిర్వహిస్తోంది. ఇది పిల్లల కోసం ప్రత్యేకం. మార్చి 16న ప్రారంభమైన ఈ సేల్ మార్చి 21 వరకు కొనసాగుతుంది. పిల్లల కోసం పుస్తకాలు, బోర్డు గేమ్స్ , స్కూల్ బ్యాగ్స్, ఆన్లైన్ క్లాసులకు ఉపయోగపడే ఎకో స్మార్ట్ స్పీకర్, ఫైర్ టివి పరికరాలు, కిండ్లే ఈ–రీడర్స్ వంటి పరికరాలపై 30% వరకు డిస్కౌంట్ అందిస్తోంది.
ఇవిగో బెస్ట్ డీల్స్
* కిడ్స్ కార్నివాల్ సేల్లో అమెజాన్ ఇండియా 4వ జనరేషన్ ఎకో డాట్ స్మార్ట్ స్పీకర్ను కేవలం రూ.3,999కు అందిస్తుంది.
* అలెక్సా వాయిస్ రిమోట్ లైట్తో పనిచేసే ఫైర్ టీవీ స్టిక్ లైట్ను రూ .2,999కు కొనుక్కోవచ్చు.
* టెన్త్ జనరేషన్ కిండ్లే ఈ–రీడర్ను కేవలం రూ .7,999కు ఇస్తోంది.
* వీడియో గేమ్స్ పైన ప్రత్యేక డిస్కౌంట్ను అందిస్తోంది. ఎక్స్ బాక్స్ సిరీస్ ఎక్స్ గేమింగ్ కన్సోల్ను రూ.49,990లకు
స్టేషనరీ పైన డిస్కౌంట్లు
పిల్లలకు అవసరమైన స్కూల్ సప్లైస్, పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, బాక్సులు వంటి వాటిపై కూడా అమెజాన్ డిస్కౌంట్ ని అందజేస్తోంది.