ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆన్లైన్ పేమెంట్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. సచివాలయాల్లో డిజిటల్ పేమెంట్స్ను సీఎం జగన్ ఈ రోజు ప్రారంభించారు. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ), కెనరా బ్యాంక్ల సహకారంతో సచివాలయాల్లో యూపీఐ చెల్లింపుల సౌకర్యాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది.
543 రకాల సేవలు
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15,004 సచివాలయాలున్నాయి. వీటన్నింటిలోనూ డిజిటల్ ట్రాన్సక్షన్లు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం అందించే దాదాపు 500కు పైగా సేవలను ప్రస్తుతం ఈ సచివాలయాల ద్వారానే పొందాల్సి ఉంటుంది. ఇంతకుముందు మీసేవల్లో ఉండే ఈ సేవలన్నింటినీ ఇప్పుడు సచివాలయాలకు మార్చారు. ఇక్కడ ఈ సేవలు పొందే ప్రజలు అవసరమైతే డిజిటల్ పేమెంట్స్ చేయడానికి వీలుగా యూపీఐ ట్రాన్సాక్షన్లకు అవకాశం కల్పించినట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. సచివాలయాల్లో ఉన్న క్యూఆర్ కోడ్స్ను స్కాన్ చేసి పేమెంట్ చేయొచ్చు.