• తాజా వార్తలు

ఓటీపీ ఉంటేనే న‌గ‌దు విత్‌డ్రా.. ఎస్‌బీఐలో కొత్త రూల్ రేప‌టి నుంచే 

ఇండియాలో నెంబ‌ర్ వ‌న్ బ్యాంక్ ఎస్‌బీఐ.. డెబిట్ కార్డు యూజ‌ర్ల కోసం కొత్త రూల్ తెచ్చింది.  ఏటీఎం నుంచి క్యాష్ విత్‌డ్రా చేసుకోవాలంటే ఓటీపీ న‌మోదు చేయాల‌న్న‌ది ఆ రూల్‌. శుక్ర‌వారం అంటే ఎల్లుండి నుంచే ఈ కొత్త రూల్ అమ‌ల్లోకి వ‌స్తుంది.  
ఒకవేళ మీ కార్డును ఎవ‌రైనా దొంగిలించి లేదా ఎవ‌రికైనా దొరికిన‌ప్పుడు వారు దాన్నుంచి పెద్ద అమౌంట్ డ్రా చేయ‌డానికి వీల్లేకుండా ఈ ఓటీపీ ప్రొటెక్ష‌న్ తీసుకొచ్చింది. 

రూ.10వేలు దాటితేనే
అయితే ఈ రూల్ అన్ని విత్‌డ్రాయ‌ల్స్‌కు వ‌ర్తించ‌దు. రూ.10 వేలు, అంత కంటే ఎక్కువ క్యాష్ విత్‌డ్రా చేసుకునేవారికే ఈ రూల్‌.  
 జనవరి1 నుంచి రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్యలో 10 వేల కంటే ఎక్కువ న‌గ‌దు నగదు విత్‌డ్రా చేయాలంటే ఈ ఓటీపీ విధానాన్ని ఎస్‌బీఐ ప్ర‌వేశ‌పెట్టింది. దాన్ని ఇప్పుడు రోజంతా విస్తరిస్తున్నట్టు ఎస్‌బీఐ ఎండీ సీఎస్‌ శెట్టి చెప్పారు.  ఎస్‌బీఐ ఏటీఎంల్లో  న‌గ‌దు తీసుకునేవారికే ఈ ఓటీపీ అవ‌స‌రం.  

ఎలా ప‌నిచేస్తుందంటే?
* ఎస్‌బీఐ క‌స్ట‌మ‌ర్లు త‌మ డెబిట్ కార్డ్‌తో 10 వేలు, అంత‌కంటే ఎక్కువ విత్‌డ్రా చేయాల‌నుకుని ఆ అమౌంట్ ఎంట‌ర్ చేస్తే రిజిస్ట‌ర్డ్ మొబైల్ నంబ‌ర్‌కు ఓటీపీ వ‌స్తుంది.
* ఓటీపీ ఎంట‌ర్ చేసి, ఆ త‌ర్వాత డెబిట్‌కార్డ్ పిన్ నంబ‌ర్ ఎంట‌ర్ చేయాలి.
* అప్పుడే మీకు క్యాష్ వ‌స్తుంది. 
 

జన రంజకమైన వార్తలు