• తాజా వార్తలు

పేటీఎంలో 10 వేల కోట్ల ఇన్వెస్ట్ మెంట్


ఇండియాలో డీమానిటైజేషన్ వల్ల బాగా లాభపడినవారు ఎవరు అని ప్రశ్నిస్తే మొట్టమొదట వినిపించే పేరు పేటీఎం. డొమెస్టిక్ ఈకామర్స్ సెక్టారో దూసుకెళ్తుండడమే కాకుండా పేమెంట్ సేవల విషయంలోనూ ఇండియాలో ఇంకే సంస్థా అందించనన్ని విస్తృత అవకాశాలు అందుబాటులోకి తెచ్చింది పేటీఎం. ఇప్పటికే పేటీఎంలో రతన్ టాటా వంటి దిగ్గజ పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టారు. ముందుముందు పేటీఎంలోకి భారీగా పెట్టుబడులు రానున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
పేటీఎం వాల్యూ పెరగనుంది...
జపాన్ కు చెందిన ఇన్వెస్ట్ మెంట్ సంస్థ సాఫ్ట్ బ్యాంకు పేటీఎంలో 150 కోట్ల డాలర్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అంటే దేశీయ కరెన్సీ ప్రకారం సుమారు 9687 కోట్లు రూపాయల వరకు ఉండొచ్చు. వన్97 కమ్యూనికేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడిచే ఫిన్ టెక్ స్టార్టప్ పేటీఎం ఈ డీల్ విషయంలో జపాన్ సంస్థతో సంప్రదింపులు జరిపినట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. మూడు నెలలుగా జరుగుతున్న ఈ సంప్రదింపుల్లో ప్రస్తుత పేటీఎం ఇన్వెస్టర్ సైఫ్ పార్టనర్స్, వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మకు చెందిన కొన్ని షేర్లను సాప్ట్ బ్యాంకు కొనుగోలుచేస్తోంది. అదేవిధంగా కంపెనీల్లోనూ నగదు రూపంలో పెట్టుబడులు పెట్టనుందని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. కాగా సాఫ్ట్‌బ్యాంకు ప్రతిపాదిత పెట్టుబడులు పెట్టినట్లయితే 5 బిలియన్‌ డాలర్ల (రూ.32,293కోట్లకు పైగా) విలువ ఉండే పేటీఎం విలువ 7 బిలియన్ల డాలర్ల(రూ.45,216 కోట్లకు)కు పెరిగే అవకాశం ఉంది.
ఫ్రీచార్జిని కొనేస్తారా..
ఇప్పటికే మొబైల్‌ వ్యాలెట్‌, ఈ-కామర్స్‌ సర్వీసుల్లో దూసుకెళ్లున్న పేటీఎం తాజాగా పెట్టుబడులతో బ్యాంకు సర్వీసుల విస్తరణను మరింత వేగవంతం చేసుకోబోతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. పేటీఎం సాఫ్ట్ బ్యాంక్ సం‍స్థ లావాదేవీల్లో భాగంగా స్నాప్‌డీల్‌ కు చెందిన పేమెంట్ బ్యాంక్ ఫ్రీచార్జ్‌ ను కూడా కొనుగోలు చేస్తుందని అంచనాలు వేస్తున్నారు. సాఫ్ట్‌బ్యాంకు కంపెనీ ఈ-కామర్స్‌ దిగ్గజ కంపెనీలైన ఫ్లిప్‌కార్డు, అమెజాన్‌ ఇండియాలకు పోటీగా భారత మార్కెట్లో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

జన రంజకమైన వార్తలు