• తాజా వార్తలు

ఎంఐ స్పోర్ట్స్ షూస్ 2తో షియోమి నయా ఎంట్రీ

మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న చైనా  కంపెనీ షియోమి మరో ఎత్తుగడతో భారతీయ వినియోగదారులను ఆకర్షించేందుకు సిద్ధమైపోయింది. స్మార్ట్‌ఫోన్లతో ఇండియాలో అడుగుపెట్టి స్మార్ట్‌ఫోన్‌ రంగంలో మొదటి స్థానంలో కొనసాగుతున్న ఈ చైనా దిగ్గజం తాజాగా  షూ మార్కెట్‌పై కన్నేసింది. ట్విటర్‌ ద్వారా సరికొత్త షూస్‌తో  ఊరిస్తూ వచ్చిన షియోమి ఎట్టకేలకు ఎంఐ బ్రాండ్‌ ద్వారా 'ఎంఐ స్పోర్ట్స్ షూస్ 2' పేరుతో సరికొత్త ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెట్టింది.  వీటి ప్రారంభ ధర  రూ.2,499గా నిర్ణయించింది.  ఎంఐ ఇండియా వెబ్‌సైట్‌ ద్వారా  ప్రీ ఆర్డర్‌ చేసినవారికి మార్చి 15 నుంచి షిప్పింగ్ మొదలవుతుంది. బ్లాక్‌, గ్రే, బ్లు రంగుల్లో లభ్యమవుతున్నాయి.  

ఎం షూస్‌  5ఇన్‌ 1 మౌల్డింగ్‌ టెక్నాలజీ,  5 రకాల  మెటీరియల్స్‌తో మేళవించిన ఇంజనీరింగ్‌ టెక్నాలజీతో  (షాక్‌ అబ్సార్బెంట్) , జారకుండా, దీర్ఘకాలం మన్నేలా వీటిని రూపొందించినట్టు కంపెనీ చెబుతోంది. యూనిక్ ఫిష్‌బోన్ స్ట్రక్చర్‌తో ఈ షూ తయారు చేశారు. ఐదు రకాల మెటీరియల్ ఉపయోగించారు. ప్రస్తుతానికి పురుషులకు మాత్రమే స్పోర్ట్స్ షూస్ రిలీజ్ చేసింది.

త్వరలో మహిళలకు కూడా రిలీజ్ చేస్తామని ప్రకటించింది. పలు  ఉత్పత్తులతో  భారతీయ మార్కెట్‌లో విస్తరిస్తున్న షియోమి  ఎంఐటీవీలు, ఎయిర్‌ ప్యూరిఫైర్లు, మాస్కులు, సన్‌ గ్లాసెస్,  సూట్‌కేస్‌లను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఇతర బ్రాండ్లకు గట్టి పోటీ ఇస్తున్న షియోమీ... ఇప్పుడు స్పోర్ట్స్ షూస్ రిలీజ్ చేసి నైకీ, రీబాక్, అడిడాస్, ప్యూమా లాంటి బ్రాండ్లకు సవాల్ విసురుతోంది.

జన రంజకమైన వార్తలు