దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్బీ. కోట్లాది మంది ఖాతాదారులున్న ఈ బ్యాంకుకు మీరు ఏ అవసరం మీద వెళ్లినా పెద్ద పెద్ద క్యూలు ఉండటం ఖాయం. మీ పాస్బుక్ అప్డేట్ చేసుకోవడానికి మిషన్లు పెట్టినా దానికోసం బ్యాంకుకు వెళ్లాల్సి రావడం, ఒక్కోసారి కియోస్క్ సరిగా పని చేయకపోవడం వంటి సమస్యలు కూడా ఉన్నాయని ఖాతాదారులు కంప్లయింట్ చేస్తున్నారు. ఇకపై ఇలా క్యూల్లో నిలబడే అవసరం లేదంటోంది ఎస్బీఐ. ఇందుకోసం కస్టమర్ మొబైల్ ఫోన్లోనే ఈ సౌకర్యం కల్పిస్తోంది.
స్వయం కియోస్క్ల్లో
కస్టమర్లు తమ పాస్బుక్ను తామే అప్డేట్ చేసుకోవడానికి 2014లోనే ఎస్బీఐ స్వయం పేరిట కియోస్క్లు ఏర్పాటు చేసింది. దీనిలో పాస్బుక్ను ఎలా అప్డేట్ చేసుకోవాలంటే..
* మీ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్పై ఉన్న బార్కోడ్ను కియోస్క్లో చూపించాలి.
* తర్వాత మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి
* ఇప్పుడు మీ పాస్బుక్ను ఓపెన్ చేసి కియోస్క్లో పెట్టాలి.
* మీ పాస్బుక్లో వివరాలను అప్టు డేట్గా ప్రింట్ చేసేస్తుంది.
* ఒకవేళ ఇంకా ఎక్కువ వివరాలుంటే పేజీని తిప్పి మళ్లీ పెట్టాలి.
ఎస్బీఐ యోనో లైట్ యాప్ ద్వారా
* ఎస్బీఐ కస్టమర్లు తమ స్మార్ట్ఫోన్లో యోనో లైట్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి.
* మీ వివరాలతో రిజిస్టర్ చేసుకుని, లాగిన్ అవ్వాలి
* యాప్ ఓపెన్ అయ్యాక దానిలో ఉన్న Accountsను క్లిక్ చేయాలి.
* తర్వాత My Balanceను క్లిక్ చేయాలి
* ఇప్పుడు savings accountను క్లిక్ చేస్తే మీ మొత్తం ట్రాన్సాక్షన్ల వివరాలన్నీ కనిపిస్తాయి.
* దీన్ని కావాలంటే పీడీఎఫ్గా మెయిల్ చేసుకుని అక్కడి నుంచి ప్రింటవుట్ తీసుకోవచ్చు.