ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్జీ 5జీ స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి రిలీజ్ చేయబోతోంది. రెయిన్ డ్రాప్ కెమెరా డిజైన్తో తీసుకురానున్న ఈఫోన్లకు ఎల్జీ వెల్వెట్ అని పేరు పెట్టింది.
మా ఫోన్ డిఫరెంట్ అంటున్న ఎల్జీ
తమ లేటెస్ట్ స్మార్ట్ఫోన్ ఎల్జీ వెల్వెట్.. డిజైన్ ప్రత్యర్థి స్మార్ట్ఫోన్లకు భిన్నంగా ఉంటుందని ఎల్జీ ప్రకటించింది. స్నాప్డ్రాగన్ 765జీ ప్రాసెసర్తో వచ్చే ఈ ఫోన్ 5జీ నెట్వర్క్ను సపోర్ట్ చేస్తుంది.
* ఆక్టాకోర్ ప్రాసెసర్
* ఆండ్రాయిడ్ 10 ఓఎస్
* ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్
* 4జీబీ ర్యామ్
* గ్రీన్,బ్లాక్, వైట్ సహా మొత్తం నాలుగు మెటాలిక్ కలర్స్లో ఈ ఫోన్ లభిస్తుంది.
కనెక్టివిటీ ఆప్షన్స్
* బ్లూటూత్ 5.0 వెర్షన్
* జీపీఎస్
* నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్సీ)
రెయిన్డ్రాప్ కెమెరాలు
రెయిన్ డ్రాప్ మోడల్ కెమెరాలతో ఈ ఫోన్ను తీర్చిదిద్దారు. వెనకవైపు మూడు కెమెరాలు విత్ ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. ఇందులో ఒకటి మెయిన్ కెమెరా మిగిలినవి రెండూ సెకండరీ కెమెరాలు. ఒకటి బ్యాక్గ్రౌండ్ బ్లర్ రెండోది డీప్ కలర్స్ కోసం మాక్రోలెన్స్ ఉంటాయని తెలుస్తోంది.
మే 7న రిలీజ్
ఎల్జీ వెల్వెట్ను మే 7 న లాంచ్ చేయనున్నట్లు కంపెనీ వీడియో టీజర్ ద్వారా ప్రకటించింది. ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతుండటంతో అది పూర్తయిన తర్వాతే ఆన్లైన్ ఫ్లాట్ఫామ్స్లో ఫోన్ అందుబాటులోకి రానుంది.