షియోమి.. భారత్లో ఎక్కువ ఫోన్లు అమ్ముడుపోతున్న బ్రాండ్లలో ఒకటి. ఈ కంపెనీ నుంచి వచ్చిన రెడ్మి ఫోన్లు
మన దేశంలో పెద్ద సంచలనమే సృష్టించాయి. ఈ సిరీస్లో వచ్చిన దాదాపు ప్రతి ఫోనూ సూపర్ హిట్టే. అందుకే మరిన్ని ఫోన్లు మార్కెట్లోకి వదలాలని ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగానే షియోమి 7 ఫోన్లు రంగంలో దింపుతోంది. అవేంటో చూద్దామా..
రెడ్మి నోట్ 8
రెడ్మి సిరీస్లో రాబోతున్న మరో ఫోన్ రెడ్మి నోట్ 8టీ. ఇది త్వరలోనే లాంచ్ కాబోతోంది. గత ఫోన్లతో పోలిస్తే ఇది మరింత అప్గ్రేడెడ్ వెర్షన్ అని చెప్పుకోవచ్చు. గత ఫోన్లకు భిన్నంగా ఫీచర్లు దీనిలో ఉన్నాయంటున్నారు ఆ సంస్థ నిపుణులు. దీనిలో లేటెస్ట్ స్నాప్డ్రాగన్ 730జీ చిప్తో గేమింగ్ సెంట్రిక్గా ఫోన్ ఉండబోతున్నట్లు సమాచారం. ఏఐ పవర్డ్ గేమింగ్ ఫీచర్ల దీని ప్రత్యేకత.
రెడ్మి కే30 ప్రొ
మార్కెట్లోకి రాబోతున్న మరో ఫోన్ రెడ్మి కే30 ప్రొ. దీనికి సంబంధించి టీజర్ని షియోమి ఇప్పటికే విడుదల చేసింది. రెడ్మి కే20 సిరీస్ మాదిరిగానే రెడ్మి కే30 ప్రొ ఫోన్లోనూ చాలా రకాల ఫీచర్లు ఉన్నాయి. స్నాప్డ్రాగన్ 855 ప్లస్ కోర్ ప్రాసెసర్ దీని ప్రత్యేకత. మల్టీపుల్ అప్గ్రేడ్స్ కోసం ఇది 5జీ సపోర్ట్గా తయారైంది. దీనిలో పంచ్ హోల్ డిస్ప్లే ఉంది. పోపల్ సెన్సార్, 64 ఎంపీ పవర్డ్ క్వాడ్ కెమెరా సిస్టమ్, 50 ఎక్స్ జూమ్, 50 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 120 హెచ్జెడ్ డిస్ప్లే దీనిఓ ఉన్నాయి.
ఎంఐ ఏ3/ఎంఐ సీసీ9 ప్రొ
రెడ్మి నుంచి విడుదల అయిన ఫోన్లలో ఎంఐ ఎం3/ఎంఐ సీసీ9 ప్రొ చాలా ఎక్సైటింగ్గా ఉన్నాయి. ఎంఐ సీసీ9 ప్రొ ఇప్పటికే అధికారికంగా విడుదల అయింది. ఎంఐసీసీ9 మోడల్ని ఎంఐ ఏ3 మోడల్గా భారత్లో విడుదల అయింది. చైనాలో ఇది ఎంఐ సీసీ 9 ప్రొ పేరిట వరిలీజ్ అయింది. స్నాప్డ్రాగన్ 730 జీ ప్రొసెసర్, 108 ఎంపీ ట్రిపుల్ రేర్ కెమెరా సిస్టమ్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి సూపర్ ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి.
అవి కూడా వస్తున్నాయ్
ఎంఐ నోట్ 10
ఎంఐ నోట్ 10 ప్రొ
రెడ్మి కే 30
రెడ్మి 8 ప్రొ