ఇప్పుడు నడుస్తోంది స్మార్ట్ఫోన్ యుగం.. మార్కెట్లో స్మార్ట్ఫోన్లు చాలా వేగంగా వస్తున్నాయి. చిన్నపాటి అప్డేట్స్తో కొత్త కొత్త ఫోన్లు వినియోగదారులకు అందుబాటులోకి వస్తున్నాయి. కస్టమర్లు ప్రధానంగా ఎక్కువ ఎంపీ కెమెరా ఉన్న ఫోన్ల మీదే దృష్టి సారిస్తున్నారు. ఈ ఏడాది కూడా అలాంటి ఫోన్లు చాలా మార్కెట్లోకి వచ్చాయి. వాటిలో 48 ఎంపీ కెమెరా ఉన్న ఫోన్లు వినియోగదారులను బాగా ఆకర్షిస్తున్నాయి. మరి అలాంటి ఫీచర్లు ఉన్న ఫోన్లలో ప్రధానమైన ఫోన్లేమిటో చూద్దామా..
రెడ్మి నోట్ 7ఎస్
48 ఎంపీ కెమెరాలతో వచ్చిన ఫోన్లలో రెడ్మి నోట్ 7 ఎస్ ఒకటి. ఇటీవలే ఈ కొత్త ఫోన్ని షియోమి కంపెనీ లాంచ్ చేసింది. ప్రస్తుతం భారత్లో అందుబాటులో ఉన్న ఫోన్లలోకెల్లా ఇది చౌకైనది. 6.3 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో పాటు స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్ దీని ప్రత్యేకత. అన్నిటికన్నా ముఖ్యంగా దీనిలో ఉన్న 48 ఎంపీ కెమెరా ప్రత్యేక ఆకర్షణ. 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఈ ఫోన్ ధర రూ.10 వేలుగా ఉంది.
ఎంఐ ఏ3
ఇటీవలే ఎంఐ ఏ3 థర్డ్ జనరేషన్ ఫోన్లు రిలీజ్ అయ్యాయి. వీటి ధర రూ.12999. 3డీ కర్వడ్ గ్లాస్ డిజైన్, 6.08 అంగుళాల హెచ్డీ అమోలెడ్ డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫుల్ గ్లాస్ బాడీ దీని ప్రత్యేకత. 48 ఎంపీ మెగా పిక్సల్ సోని సెన్సార్ ఉన్న ఈ ఫోన్తో ఫొటోలు గొప్పగా వస్తాయి. 8 మెగా పిక్సల్ సెకండరీ సెన్సార్ ఉండడంతో 118 డిగ్రీల వైడ్ యాంగిల్తో ఫొటోలు తీసుకోవచ్చు.
రియల్ మి 5 ప్రొ
హై క్వాలిటీ పోలీ కార్బైట్ బాడీతో వచ్చింది రియల్ మీ 5 ప్రొ ఫోను. దీనిలో 6.3 అంగుళాల హెచ్డీ స్క్రీన్, గొరిల్లా గ్లాస్ 3 ప్లస్ ప్రొటెక్షన్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. 4 జీబీ, 6 జీబీ, 8 జీబీ, 128 జీబీ మోడల్స్లో ఈ ఫోన్ వచ్చింది. దీని ప్రత్యేకత 48 ఎంపీ కెమెరా ఉండడం. అన్నిటికన్నా ముఖ్యంగా ఇది 15 వేల కన్నా తక్కువ ధరకే ఇది లభిస్తుంది. ఈ కెమెరా ద్వారా 119 డిగ్రీల వైడ్ యాంగిల్లో ఫొటోలు తీసుకోవచ్చు. క్లీన్ అండ్ క్రిస్పి ఫొటోలకు ఇది బాగా యూజ్ అవుతుంది.