వారానికో స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి దూసుకొస్తున్న రోజులివి. చిన్నపాటి మార్పులతో ఈ ఫోన్లను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తున్నాయి ఫోన్ల కంపెనీలు. తాజాగా కూడా కొన్ని కంపెనీలు కొత్త అప్డేట్లతో ఫోన్లను రిలీజ్ చేశాయి. మరి అలా దూసుకొచ్చిన ఫోన్లు ఏంటో చూద్దామా..
గూగుల్ పిక్సల్ 4 ఎక్సెల్
ఐఫోన్ల తర్వాత బాగా వినయోగదారులను ఆకట్టుకునే ఫోన్లలో గూగుల్ పిక్సల్ ఫోన్లు కూడా ఒకటి. ఇప్పుడు అదే సిరీస్ నుంచి గూగుల్ పిక్సల్ 4 ఎక్సెల్ ఒకటి. దీనిలో క్వాల్కామ్ 855 స్నాప్డ్రాగన్ టెక్నాలజీతో పాటు ఆండ్రాయిడ్ 10 వెర్షన్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమెరీ లాంటి స్పెసిఫికేషన్లు దీనిలో ఉన్నాయి.
వివో వీ17 ప్రొ
వీవో సిరీస్లో వచ్చిన ఫోన్లన్నీ దాదాపు హిట్టే. వీటి వరుసలోనే మరో ఫోన్ రాబోతోంది అదే వివో వీ 17 ప్రొ. ఆరు కెమెరాలతో తయారు కావడం దీని ప్రత్యేకత. నాచ్ లెస్ డిజైన్ టెక్నాలజీ దీనిలో ఉపయోగించారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, అమోలెడ్ డిస్ప్లే లాంటి స్పెసిఫికేషన్లు దీని ప్రత్యేకత. ఇవే కాక చాలా ఆసక్తికరమైన ఫీచర్లు ఉన్నాయని.. అయితే వాటిని రహస్యంగా ఉంచినట్లు ఆ సంస్థ చెబుతోంది. దీని ధర రూ.30 వేల వరకు ఉంటుంది.
రియల్మీ ఎక్స్టీ
రియల్మీలో ప్రత్యేకత ఏంటంటే 64 ఎంపీ కెమెరాతో వచ్చిన తొలి స్మార్ట్ఫోన్ ఇది. ఈ సిరీస్లోనే వచ్చిన రియల్మీ ఎక్స్టీ ఫోన్లో కూడా ఎన్నో ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయట. మిడ్ రేంజ్ బడ్జెట్లో, మంచి స్పెసిఫికేషన్లతో ఈ ఫోన్లను తయారు చేశారు. రెడ్మి నోట్ 8 మాదిరిగానే సెన్సార్ ఉండడం దీని స్పెషల్. దీని ధర రూ.15.999గా నిర్ణయించారు. కొత్త ఫోన్లను ట్రై చేసే వాళ్లకు, మంచి కెమెరా, లుక్ కోరుకునేవాళ్లకు ఇదో బెస్ట్ ఆప్షన్.
రెడ్మీ నోట్ 8 ప్రొ
భారత్లో ఎక్కువ విజయవంతమైన ఫోన్లలో రెడ్మి ఫోన్లు ఒకటి. ఈ సిరీస్లో వచ్చిన దాదాపు అన్ని ఫోన్లూ విజయవంతం అయ్యాయి. ఇందులో భాగంగానే రెడ్మి నోట్ 8 ప్రొ వెర్షన్ వచ్చింది. నవంబర్ తొలి వారంలో ఇది మార్కెట్లోకి అందుబాటులోకి వస్తోంది. 6.53 అంగుళాల ఫుల్ హెడ్డీ స్క్రీన్, 3డీ కవర్డ్ సీజీ 5 గ్లాస్, శాండ్విచ్ బాడీ, 64 ఎంపీ కెమెరా, 2 ఎంపీ విడ్త్ సెన్సార్, ఆల్ట్రా వైడ్ లెన్స్, 2 సీఎం మైక్రో లెన్స్, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి మంచి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర 14000.