ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్.. విపరీతంగా డెవలప్ అవుతున్న అంశాల్లో ఇదొకటి. ప్రతి రంగంలోనూ ఏఐని చొప్పించాలని కంప్యూటర్ నిపుణులు ప్రయత్నిస్తున్నారు. తద్వారా వేగంగా పనులు జరిపించుకోవచ్చనేది వారి ఉద్దేశం. ఇప్పుడే ఈ టెక్నాలజీని ఇన్కంట్యాక్స్ శాఖ కూడా అందిపుచ్చుకుంది. త్వరలోనే మన ట్యాక్స్ రిటర్స్ని ఏఐ టెక్నాలజీ ద్వారా ఐటీ శాఖ తనిఖీ చేయించనుంది. మరి ఏమిటీ ఏఐ తనిఖీలు.. ఏమిటీ కథ చూద్దామా..
ప్రపంచంలోనే తొలి దేశం
ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ను ఉపయోగించి ఇన్కంట్యాక్స్ రిటర్న్స్ని చెక్ చేయించే దిశగా ఐటీ శాఖ అడుగులు వేస్తోంది. ఇందుకోసం ఎంతోమంది నిపుణులతో చర్చలు సాగిస్తోంది. భారత్లో ఐటీ రిటర్నింగ్ మిగిలిన దేశాలతో పోలిస్తే చాలా ఎక్కువ. ఎక్కువమంది ఉద్యోగులు ఉండడంతో ఐటీ తప్పనిసరి అవుతుంది. ఈ రిటర్న్లను తనిఖీ చేసి వారికి రిఫండ్లు ఇవ్వడం చాలా కాలం పడుతుంది. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సాయం తీసుకోవాలని ఐటీ శాఖ భావిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఐటీ రిటర్న్స్ను తనిఖీ చేయడానికి ఏఐ ఉపయోగించి తొలి దేశంగా భారత్ ఘనత సాధించనుంది.
త్వరలో రాబోతోంది
ట్యాక్స్ అసెస్మెంట్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ సాయం తీసుకుంటామని భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవలే ప్రకటించారు. అక్టోబర్ మొదటి వారంలో ప్రయోగత్మకంగా ఈ రెండింటిని పరీక్షించబోతున్నామని ఆమె చెప్పారు. ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల లెక్కల్లో పారదర్శకత పెరుగుతుందని.. ప్రజల్లోనూ నమ్మకం పెరుగుతుందని ఆమె చెబుతున్నారు. దీని వల్ల అవినీతికి ఆస్కారం ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. ఉదాహరణకు మీ టీడీఎస్ రూ10 లక్షలు కట్ అయితే. దానికి తగ్గ అమౌంట్ చూపించకపోతే ఏఐ టెక్నాలజీ ఇది పనిగట్టి సమాచారం ఇస్తుంది.