• తాజా వార్తలు

మ‌న టీసీఎస్‌.. ఐటీలో ప్రపంచ నెంబ‌ర్ వ‌న్

 ఐటీ రంగంలో ఇండియ‌న్ ఐటీ దిగ్గ‌జం టాటా క‌న్స‌లెన్ట్సీ సర్వీసెస్ (టీసీఎస్‌) స‌రికొత్త రికార్డు సృష్టించింది. ప్ర‌పంచంలో అత్యంత విలువైన ఐటీ కంపెనీగా నిలిచింది. ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యంత విలువైన ఐటీ కంపెనీగా ఉన్న‌ యాక్సెంచర్‌ను వెనక్కి నెట్టింది .

బైబ్యాక్ బ్యాక‌ప్‌తో

బైబ్యాక్‌ వార్తలతో టీసీఎస్   షేర్లు బీఎస్ఈలో గురువారం 3.19 శాతం లాభంతో రూ.2,824.80 వద్ద ముగిశాయి. దీంతో టీసీఎస్‌ మార్కెట్‌ విలువ గురువారం ఒక్కరోజే రూ.32,796.63 కోట్లు పెరిగి రూ.10.60 లక్షల కోట్లకు (14,473 కోట్ల డాలర్లు) చేరింది.

* టీసీఎస్ తాజా విలువ యాక్సెంచర్‌ షేర్ల మార్కెట్‌ క్యాప్‌ కంటే ఏకంగా 233 కోట్ల డాలర్లు ఎక్కువ.

 

46 దేశాల్లో కార్య‌క‌లాపాలు

1968లో ముంబ‌యి హెడ్‌క్వార్ట‌ర్‌గా ప్ర‌యాణం ప్రారంభించిన టీసీఎస్ ఇప్పుడు 46 దేశాల్లో ఐటీ స‌ర్వీసెస్ అందిస్తోంది. ఈ కంపెనీలో ప్రపంచ‌వ్యాప్తంగా ఏకంగా నాలుగ‌న్న‌ర ల‌క్ష‌ల మంది ఎంప్లాయిస్ ప‌ని చేస్తున్నారు. ‌

జన రంజకమైన వార్తలు