టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్సు జియో ఇకపై బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సంస్థలకూ చెమటలు పట్టించడానికి సిద్ధమైపోయింది. జియో ఫైబర్ పేరిట మరో రెండు నెలల్లో అత్యంత వేగవంతమైన బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ను యూజర్లకు అందించేందుకు రెడీ అవుతోంది. దీంతో ఇప్పటికే ఈ రంగంలో ఉన్న సంస్థలన్నీ కంగారు పడుతున్నాయి.
మెట్రోలతో మొదలు..
'ఫైబర్ టు ద హోమ్’ (FTTH))' పేరిట రిలయన్స్ జియో తొలుత జియో ఫైబర్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ ను మెట్రో నగరాల్లో అందుబాటులోకి తేనుంది. హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ నగరాలతోపాటు గుజరాత్లోని జియో హోమ్ టౌన్ జామ్ నగర్లోనూ జియో ఫైబర్ ముందుగా అందుబాటులోకి రానుంది. ఆ తరువాత దేశంలో మిగతా పట్టణాలకు విస్తరించాలన్నది ప్లాన్.
ఇది కూడా 3 నెలలు ఫ్రీ...
జియో తన జియో ఫైబర్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ను మొదటి మూడు నెలల పాటు యూజర్లకు ఉచితంగా అందివ్వనుంది. ఆ సమయంలో యూజర్లు గరిష్టంగా 100 ఎంబీపీఎస్ స్పీడ్ను పొందవచ్చు. అన్లిమిటెడ్ ఇంటర్నెట్ డేటాను ఉపయోగించుకోవచ్చు.
రూ.500 నుంచి ప్లాన్లు ప్రారంభం
ఆ తరువాత రూ.500, రూ.2వేల ప్లాన్లు రెండింటిని ముందుగా ప్రవేశపెట్టనున్నారు. రూ.500 ప్లాన్తో 600 జీబీ డేటా ఉచితంగా వస్తుంది. రూ.2వేల ప్లాన్తో 1000 జీబీ డేటా వస్తుంది. ఈ రెండు ప్లాన్లలోనూ యూజర్లు గరిష్టంగా 100 ఎంబీపీఎస్ స్పీడ్తో నెట్ను బ్రౌజింగ్ చేసుకోవచ్చు. అయితే నిర్దేశించిన డేటా లిమిట్ పూర్తయితే స్పీడ్ తగ్గుతుంది.
ఫుల్ స్పీడ్
జియో ఫైబర్ అందించనున్న 100 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ స్పీడ్తో 5జీబీ సైజ్ గల హెచ్డీ సినిమాను కేవలం 6 నిమిషాల్లోనే డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుంటుంది. అదేవిధంగా 5 ఎంబీ సైజ్ గల 100 పాటలను కేవలం 24 సెకన్లలోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతటి వేగాన్ని జియో ఫైబర్ ఇవ్వనుంది.
మీ నెట్ వర్క్ ప్రొవైడర్ దిగిరావాల్సిందే..
ఎయిర్టెల్, యాక్ట్, హాత్వే వంటి ప్రముఖ సంస్థలతోపాటు బీఎస్ఎన్ఎల్ కూడా బ్రాడ్బ్యాండ్ సేవలను వినియోగదారులకు అందిస్తున్నాయి. ఇక జియో ఫైబర్ వస్తే ఈ సంస్థలు ఆఫర్లు ప్రకటించి వినియోగదారులను కాపాడుకోవాల్సిందే.