ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ల్యాప్టాప్ ఒకటి ఆన్లైన్ వేలంలో భారీ ధర పలుకుతోంది. ఆరు భయంకరమైన వైరస్లతో ఇది 'వరల్డ్స్ మోస్ట్ డేంజరస్’ ల్యాప్టాప్గా పేరు తెచ్చుకుంది. అత్యంత ప్రమాదకరమైన, ప్రపంచానికి భారీ నష్టాన్ని మిగిల్చిన ఆరు వైరస్లు ఈ ల్యాపీలో వున్నాయి. ఈ వైరస్ కారణంగా ప్రపంచంలో సుమారు 100 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందట. ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన ల్యాపీని సొంతం చేసుకునేందుకు గట్టి పోటీ నెలకొంది. చాలామంది ఈ ల్యాపీని సొంతం చేసుకునేందుకు ఎగబడుతున్నారు.
సెక్యూరిటీ సంస్థ డీప్ ఇన్స్టింక్ట్ ఆధ్వర్యంలోనే గ్వో ఓ డాంగ్ అనే ఇంటర్నెట్ ఆర్టిస్ట్ ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారు. ఆర్డినరీ 10.2 అంగుళాల శాంసంగ్ NC10-14GB ల్యాప్ టాప్ లో విండోస్ XP (SP3) ఆపరేటింగ్ సిస్టమ్ ను రన్ చేస్తున్నాడు. ఇందులో 6 ప్రాణాంతక వైరస్ లతో లోడ్ చేశాడు. అతి ప్రమాదకరమైన ఆరు వైరస్లను లైవ్లీగా ఉంచి మరీ, ఈ డివైస్ను వేలానికి వుంచారు. డిజిటల్ ప్రపంచానికి ఎదురవుతున్న ముప్పును భౌతికంగా ప్రజలకు తెలియ చెప్పేందుకే ఈ ప్రయత్నమని గ్వో చెప్పారు.
కంప్యూటర్లోని భయంకరమైన వైరస్లు మనల్ని భౌతికంగా ప్రభావితం చేయలేవని చాలామంది ప్రజలు భావిస్తున్నారు. కానీ అవి ఆర్థికంగా ఎంత నష్టాన్ని కలుగజేస్తాయో గమనించలేక పోతున్నారన్నారు. అందుకే ఆర్థికంగా భారీ నష్టాన్ని కలుగ జేసిన ఈ ఆరు భయంకరమైన వైరస్లను ఎంచుకున్నట్టు తెలిపారు. విండోస్ ఎక్స్పీ ఆధారిత శాంసంగ్ ఎన్సీ10 దీని పేరు.10.2 అంగుళాల 14జీబీ (2008) డివైస్ ఇది. వైఫై, ఫ్లాష్డ్రైవ్కి కనెక్ట్ చేయనంత వరకూ దీన్నుంచి మిగతా పీసీలకు ఈ వైరస్లకు వ్యాపించకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకున్నామని నిర్వాహకులు చెప్పారు.
మాల్ వేర్ తో నిండి ఉన్న ఆరు పీసుల బరువు 2.8lbs ఉండగా.. అందులో పవర్ కార్డ్, రిస్టార్ట్ స్ర్కిప్ట్ తో లోడ్ చేశాడు. ఈ ల్యాప్ టాప్ లోని ప్రాణాంతక వైరస్ లు.. మరో సిస్టమ్ కు ఎయిర్ స్పేస్ ద్వారా వ్యాపించవు. మరో నెట్ వర్క్ సిస్టమ్ కు కనెక్ట్ చేసినప్పుడు మాత్రమే వైరస్ ఎఫెక్ట్ అవుతుందని గ్వివో ఓ డాంగ్ తెలిపారు.ఐ లవ్యూ, మైడూమ్, సోబిగ్, వాన్నా క్రై, డార్క్ టెక్విలా బ్లాక్ఎనర్జీ అనే ఆరు వైరస్లు ఈ ల్యాప్టాప్లో దాగి వున్నాయి. 'ది పెర్సిస్టెన్స్ ఆఫ్ ఖోస్' అనే శీర్షికతో, గ్వోఓ ఓ డోంగ్ దీన్ని సృష్టించారు. ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్న ప్రైవేట్ వేలంలో ఇది ఇప్పటికే 1.2 మిలియన్ డాలర్లు (సుమారు రూ.8 కోట్ల, 34 లక్షలు) ధర పలుకుతోంది.