ఆధార్ కార్డ్ నుంచి ఫేస్బుక్ వరకు, ఓలా నుంచి గూగుల్ పే వరకు టెక్నాలజీ రంగంలో నిత్య అవసరాలుగా మారిపోయిన సంస్థలు ఎన్నో. వీటికి సంబంధించి ఈ వారం చోటు చేసుకున్న మేజర్ అప్డేట్స్ ఈ వారం టెక్ రివ్యూలో మీకోసం ఒకే చోట..
మానవహక్కుల విధానం కోసం ఫేస్బుక్లో డైరెక్టర్ పోస్ట్
ఫేస్బుక్ వేదికగా మానవహక్కుల ఉల్లంఘించేలా వేధింపులు జరుగుతున్నాయన్న ఫిర్యాదులపై ఫేస్బుక్ స్పందించింది. దీనికోసం మానవ హక్కుల విధానం కోసం ఓ డైరెక్టర్ను నియమించుకోవాలని భావిస్తోంది. వివాదాల పరిష్కారం, శాంతి స్థాపన వంటి లక్ష్యాలతో ఈ డైరెక్టర్ పోస్టు బాధ్యతలు ఉంటాయి. మరోవైపు ఇన్స్టాగ్రామ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) మార్నీ లెవిన్ ఫేస్బుక్లో జాయినయ్యారు. ఫేస్బుక్ గ్లోబల్ పార్టనర్ షిప్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ వింగ్ వైస్ ప్రెసిడెంట్గా ఆమె బాధ్యతలు చేపడతారు.
స్కూళ్లలో ఆధార్ ఎన్రోల్మెంట్.. 200 కోట్లు కేటాయింపు
పాఠశాల స్థాయిలోనే ఆధార్ నమోదు చేపట్టాలని ఆధార్ ఆథరైజ్డ్ ఏజెన్సీ UIDAI నిర్ణయించింది. తాలూకా, మండల స్థాయిలో ఈ నమోదు చేపట్టే మిషన్ల కోసం 200 కోట్లు కేటాయించింది. ఒక్కో తాలూకాకు రెండు ఆధార్ నమోదు యంత్రాలను కేటాయించబోతోంది.
ఇంకా తేలని ఈ-కామర్స్ విధానం
దేశంలో ఈ-కామర్స్ విధానం ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ ఆలోచనకు అడుగడుగునా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే దీనిమీద డ్రాఫ్ట్ బిల్ తయారుచేశారు. దీన్ని ప్రజాభిప్రాయ సేకరణ కోసం అందరికీ అందుబాటులోకి తెచ్చారు. అయితే అసలు ఇలాంటి విధానమే అవసరం లేదని ఉన్నతాధికారులు చెబుతుండడంతో అసలు ఈవిధానం అమలులోకి వస్తుందా లేదా అన్నది డౌట్గా మారింది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ సెక్రటరీ రమేష్ అభిషేక్ మాట్లాడుతూ అసలు ఇలాంటి పాలసీ అక్కర్లేదన్నారు. ఈ-కామర్స్ వ్యాపారం దానంతటదే సమస్యల్లేకుండా జరిగిపోతోంది కదా అని నీతిఆయోగ్ సీఈవో అమితాబ్కాంత్ కామెంట్ చేశారు.
న్యూజిలాండ్లోనూ ఓలా సర్వీస్లు
ఇండియాలో క్యాబ్ సర్వీస్లతో బాగా పాపులరయిన ఓలా ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి వెళ్లిపోయింది. ఆస్ట్రేలియా, యూకే దేశాల్లోనూ క్యాబ్ సర్వీసులను నడపడానికి అక్కడ రోడ్లను పరిశీలించింది. లేటెస్ట్గా న్యూజిలాండ్లోని మూడు ప్రధాన నగరాలు వెల్లింగ్టన్, ఆక్లాండ్, క్రైస్ట్చర్చ్ల్లోనూ క్యాబ్ సర్వీసులు నడపోతుంది. బ్రయాన్ డ్విల్ను న్యూజిలాండ్ ఓలా మేనేజర్గా నియమించింది.
గూగుల్ పేకి రెండున్నర కోట్ల మంది యాక్టివ్ యూజర్లు
గూగుల్ పే (ఇంతకు ముందు గూగుల్ తేజ్) వాడుతున్న యూజర్ల సంఖ్య 2.5 కోట్లకు చేరింది. నెలవారీ యాక్టివ్ యూజర్ల సంఖ్య 25 మిలియన్ల (రెండున్నర కోట్ల)కు చేరిందని గూగుల్ ప్రకటించింది. 2017 సెప్టెంబర్ 18 నుంచి ఈ ఏడాది కాలంలో 86 కోట్ల ట్రాన్సాక్షన్లు గూగుల్ పే (గూగుల్ తేజ్) ద్వారా జరిగాయి. వీటి విలువ 2లక్షల కోట్లకు పైనే.
టెలికం బిజినెస్ వదిలేసిన రిలయన్స్ గ్రూప్
అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ టెలికం బిజినెస్ను పూర్తిగా వదిలేసినట్లు సంస్థ చైర్మన్ అనిల్ అంబానీ ఏజీఎంలో ప్రకటించారు. ప్రస్తుతం తమ దృష్టి అంతా టెలికం బిజినెస్ వల్ల వచ్చిన 40 వేల కోట్ల రూపాయల నష్టాన్ని ఎలా పూడ్చాలన్న దానిపైనే ఉందని ఆయన చెప్పారు. రిలయన్స్ టెలికం ఆస్తులను తన అన్న ముకేష్ అంబానీ కంపెనీ జియోకు అమ్మేయడానికి అనిల్ ప్లాన్ చేస్తున్నారు. వాటి వల్ల 25వేల కోట్లరూపాయల వరకు సమకూరవచ్చని అంచనా.
డేటా ప్రొటెక్షన్ డ్రాఫ్ట్ బిల్లుకు పేటీఎం మద్దతు
వినియోగదారుల డేటా ప్రొటెక్షన్పై తయారుచేసిన డ్రాఫ్ట్ బిల్లుకు ఈకామర్స్, పేమెంట్స్ సంస్థ పేటీఎం మద్దతు ప్రకటించింది. ఇది ఇండస్ట్రీతోపాటు వినియోగదారులకు కూడా మేలు చేసే బిల్ అని పేటీఎం ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ అఫ్ ఇండియా (IAMAI)కి లేఖ రాసింది. డ్రాఫ్ట్ బిల్పై స్పందించాలంటూ IAMAI ఈ ఇండస్ట్రీలో ఉన్న అన్ని కంపెనీలకు ఇంతకు ముందే లేఖలు పంపింది.
గూగుల్ పేపై గురిపెట్టిన పేటీఎం
గూగుల్ పే.. పేమెంట్స్ ఫ్లాట్ఫాంగా రెగ్యులేట్ కాని సంస్థ అని పేటీఎం కామెంట్ చేసింది. ఇదే విషయంపై నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)ని ప్రశ్నించింది. గూగుల్ పే పేమెంట్స్ పాలసీని సరిచూడాలని ఎన్పీసీఐని కోరింది. ఇప్పటికే వాట్సాప్ గూగుల్ పే మీద ఇలాంటి కామెంట్స్ చేసింది. ఇప్పుడు పేటీఎం కూడా లైన్లోకి రావడంతో ఎన్పీసీఐ ఏం చేస్తుందనేది ఆసక్తి కలిగిస్తోంది.ia”. Read it here
లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేయడానికి పోర్టల్
లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేయడానికి, అత్యాచారం, గ్యాంగ్ రేప్, చిన్నపిల్లలమీద లైంగిక వేధింపులు, వాళ్లను హింసించడం వంటి మీ దృష్టికి వస్తే కంప్లయింట్ ఇవ్వడానికి భయపడక్కర్లేదు. ఇకపై ఆన్లైన్లోనే ఇలాంటి కంప్లయింట్స్ ఇవ్వడానికి కేంద్ర హోం శాఖ ఓ పోర్టల్ను తీసుకొచ్చింది.