ఆత్మనిర్భర్ భారత్ (మేకిన్ ఇండియా)ను కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. స్వదేశీ ప్రాసెసర్ ఛాలెంజ్ను తీసుకొచ్చింది. Swadeshi Microprocessor Challenge- Innovate Solutions For Aatmanirbhar Bharat పేరుతో కాంటెస్ట్ను ప్రారంభించింది. స్వదేశీ ప్రాసెసర్ తయారుచేసే కాంటెస్ట్లో నెగ్గినవారికి రూ.4.3 కోట్లు బహుమతి ఇస్తామని ప్రకటించింది.
2021 జూన్ వరకు పోటీ
* 2021 జూన్ వరకు ఈ పోటీ ఉంటుంది. స్వదేశీ మైక్రో ప్రాసెసర్ తయారుచేయడానికి ఆసక్తి ఉన్నవారు ఈ పోటీలో పాల్గొనవచ్చు.
* సెమీ ఫైనల్స్కి వచ్చిన 100 మందికి కలిపి మొత్తం కోటి రూపాయలు ఇస్తారు.
* 25 మంది ఫైనలిస్టులకు రూ. కోటి ఇస్తారు.
* టాప్లో నిలిచిన 10 మందికి 2.3 కోట్ల రూపాయలు ఇస్తారు. ఈ మొత్తాన్ని ప్రాసెసర్ తయారీకి ఉపయోగించవచ్చు.
ఐఐటీ మద్రాస్, సీడాక్
ఐఐటీ మద్రాస్, సీడాక్.. శక్తి (32 బిట్), వేగా (64 బిట్) పేరుతో రెండు మైక్రోప్రాసెసర్లు తయారుచేశాయి. వీటిని ఉపయోగించుకుని మైక్రోప్రాసెసర్ తయారుచేసే పోటీలో పాల్గొనేవారు మైక్రోప్రాసెసర్ తయారుచేయొచ్చు.