కరోనా వైరస్ నేపథ్యంలో కంపెనీలన్నీ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ టెక్ దిగ్గజం ఐబీఎం భారత్లోని నిరుద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. 500 ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు తన లింక్డిన్ పేజీలో ప్రకటించింది.
ఏయే పోస్టులంటే
* మేనేజర్లు
* మిడిల్వేర్ అడ్మినిస్టేటర్లు(పరిపాలన విభాగం)
* డేటా సైంటిస్ట్లు
* నెట్వర్క్, క్లౌడ్ ఆర్కిటెక్ట్లు తదితర కేటగిరీలలో ఉద్యోగాలిస్తామని ఐబీఎం ప్రకటించింది.
లక్షన్నర మంది ఉద్యోగులు
ఐబీఎంలో ప్రపంచవ్యాప్తంగా మూడున్నర లక్షల మంది పనిచేస్తున్నారు. అయితే అందులో మూడో వంతు మంది అంటే దాదాపు లక్షన్నర మంది ఉద్యోగులు భారత్లో ఉండడం విశేషం.