• తాజా వార్తలు

ఐబీఎంలో 500 కొలువులు.. లాక్‌డౌన్‌లోనూ శుభ‌వార్త‌

కరోనా వైరస్ నేపథ్యంలో కంపెనీలన్నీ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లోనూ టెక్ దిగ్గజం ఐబీఎం  భారత్‌లోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది.  500 ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్లు త‌న లింక్డిన్ పేజీలో ప్రకటించింది. 

ఏయే పోస్టులంటే 
* మేనేజర్లు 

 * మిడిల్‌వేర్‌ అడ్మినిస్టేటర్లు(పరిపాలన విభాగం) 

* డేటా సైంటిస్ట్‌లు 

* నెట్‌వర్క్‌, క్లౌడ్‌ ఆర్కిటెక్ట్‌లు తదితర కేటగిరీలలో ఉద్యోగాలిస్తామ‌ని ఐబీఎం ప్ర‌క‌టించింది. 

ల‌క్ష‌న్న‌ర మంది ఉద్యోగులు
 ఐబీఎంలో ప్రపంచవ్యాప్తంగా మూడున్నర లక్షల మంది పనిచేస్తున్నారు. అయితే అందులో మూడో వంతు మంది అంటే దాదాపు ల‌క్ష‌న్న‌ర మంది ఉద్యోగులు భారత్‌లో ఉండడం విశేషం.  

జన రంజకమైన వార్తలు