• తాజా వార్తలు

కౌన్‌బ‌నేగా క‌రోడ్‌ప‌తి.. వీడియో కాన్ఫ‌రెన్సింగ్ సొల్యూష‌న్ త‌యారుచేస్తే అది మీరే 

జూమ్ యాప్‌.. వీడియో కాన్ఫ‌రెన్స్‌ల‌కు లాక్‌డౌన్ టైమ్‌లో సాధార‌ణ ఉద్యోగుల నుంచి సెంట్ర‌ల్ మినిస్ట‌ర్ల వ‌ర‌కు దీన్ని వాడుతున్నారు. అయితే జూమ్ యాప్ ద్వారా హ్యాక‌ర్స్ కాన్ఫ‌రెన్స్ కాల్స్‌లోకి చొర‌బ‌డి డేటా కొట్టేస్తున్నార‌న్న వార్త‌ల‌తో అంద‌రూ అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఏకంగా సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంటే ఈ యాప్ వాడొద్ద‌ని త‌మ మంత్రులంద‌రికీ సూచించింది. దీన్ని బ‌ట్టి డేటా చోరీ జ‌ర‌గ‌డం నిజ‌మేన‌న్న అనుమానాలు బ‌ల‌పడుతున్నాయి. ఈ ప‌రిస్థితుల్లో సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ స్టార్ట‌ప్‌ల‌కు ఓ గోల్డెన్ ఛాన్స్ ఇచ్చింది.  

ఏం కావాలంటే..
ప్ర‌భుత్వం ఉప‌యోగించుకోవ‌డానికి వీలుగా ఒక వీడియో కాన్ఫ‌రెన్సింగ్ ఫ్లాట్‌ఫాంను డిజైన్ చేయాల‌ని స్టార్ట‌ప్‌ల‌ను  కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్‌ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ మంత్రిత్వ శాఖ కోరింది. 

* ఈ ఫ్లాట్‌ఫాం అన్ని ర‌కాల వీడియో, ఆడియో క్వాలిటీల‌ను స‌పోర్ట్ చేయాలి. ఎంత లోక్వాలిటీలో ఉన్నా ప‌ని చేయాలి.

* అన్ని ర‌కాల డివైస్‌లు ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌, ల్యాప్‌టాప్‌, పీసీ ఇలా అన్నింటిలోనూ ప‌ని చేయాలి. సాధ్య‌మైనంత ఎక్కువ మంది ఒకేసారి వీడియో, ఆడియో కాన్ఫ‌రెన్స్‌కు వీలుగా దీన్ని డిజైన్ చేయాలి.

* నెట్‌వ‌ర్క్ స్ట్రాంగ్‌గా ఉన్నా, వీక్‌గా ఉన్నా కూడా ప్ర‌భావవంతంగా ప‌ని చేయాలి.

ప్రోటో టైప్ త‌యారు చేస్తే  5ల‌క్ష‌లు
*  ఆస‌క్తి ఉన్న స్టార్ట‌ప్ కంపెనీలు MeitY వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్ట‌ర్ చేసుకోవాలి. ఏప్రిల్ 30 వ‌ర‌కు రిజిస్ట్రేష‌న్‌కు టైమ్ ఉంది. 

*  త‌ర్వాత వీడియో కాన్ఫ‌రెన్సింగ్ ఫ్లాట్‌ఫామ్ డెవ‌ల‌ప్ చేయ‌డానికి ఇలా వ‌చ్చిన‌వారి నుంచి 10 టీమ్‌ల‌ను సెలెక్ట్ చేస్తారు.

* సెలెక్ట్ అయిన టీమ్స్‌కు ప్రోటోటైప్ త‌యారు చేయ‌డానికి రూ.5 ల‌క్ష‌ల క్యాష్ ఇస్తారు. 

* ప్రోటోటైప్ సెలెక్ట్ చేసిన త‌ర్వాత ఈ 10టీమ్స్‌లో నుంచి మూడు టీమ్‌ల‌ను షార్ట్ లిస్ట్ చేస్తారు. 

* ఈ మూడు టీమ్స్‌కు 20 ల‌క్ష‌ల చొప్పున ఇస్తారు. 

*  ఫైన‌ల్‌గా ఒక టీమ్ త‌యారు చేసిన వీడియో కాన్ఫ‌రెన్స్‌ఫ్లాట్‌ఫామ్‌ను సెలెక్ట్ చేస్తారు. 

* విజేత‌గా నిలిచిన టీమ్‌కు రూ.కోటి ఇచ్చి ఆ సొల్యూష‌న్‌ను ఏర్పాటు చేయ‌మంటారు. ఆప‌రేష‌న్స్‌, మెయింట‌నెన్స్ కోసం రూ.10 ల‌క్ష‌లు అద‌నంగా ఇస్తారు.  

జన రంజకమైన వార్తలు