కరోనా వైరస్ భయంతో జనం లాక్డౌన్ ముగిసినా సినిమా హాళ్లకు వెళ్లడానికి భయపడే పరిస్థితి వచ్చింది. దీంతో చాలామంది పెద్ద హీరోలు సినిమాల విడుదలను వాయిదా వేసుకుంటున్నారు. ఇక చిన్నసినిమాల నిర్మాతలు ఓటీటీలో అంటే అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, జీ5, హాట్స్టార్ లాంటి వీడియోస్ట్రీమింగ్ ఫ్లాట్ఫామ్స్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే తక్కువ బడ్జెట్తో తీసిన తమ సినిమాలకు ఓటీటీలు ఇచ్చే డబ్బుతోనైనా రిలీజ్ చేయాలని, లేకపోతే వడ్డీలు పెరిగిపోతాయని భయపడుతున్నారు. ఇటీవల అమృతారామమ్ అనే తెలుగు సినిమాను అలాగే రిలీజ్ చేశారు. అందుకే ఇప్పుడు ఓటీటీల ప్రాధాన్యం పెరిగింది. టెలికం కంపెనీలు కూడా తమ కస్టమర్లను ఆకట్టుకోవడానికి మొబైల్ ప్లాన్లతో ఓటీటీ సబ్స్క్రిప్షన్లను ఫ్రీగా అందిస్తున్నాయి.
అన్ని కంపెనీలూ అదే రూట్
ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ అమెజాన్ ప్రైమ్ను ఫ్రీగా అందించింది. వొడాఫోన్ ఐడియా కూడా ఇదే బాటలో వెళ్లింది. జియోకయితే సొంతంగా జియో టీవీ, జియో సినిమా యాప్సే ఉన్నాయి. ఆ ఫ్లాట్ఫామ్స్ మీదే అది బోల్డంత ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. లేటెస్ట్గా ఎయిర్టెల్.. జీ5తో పార్టనర్షిప్ను మరింత పెంచుకుంది.
ఎయిర్టెల్-జీ5 సమ్మర్ బొనాంజా
తమ పోస్ట్పెయిడ్, బ్రాడ్బ్యాండ్ యూజర్లకు ఎయిర్టెల్-జీ5 సమ్మర్ బొనాంజాను ప్రకటించింది.
రూ.149 అంతకంటే ఎక్కువ ప్యాక్లతో రీచార్జ్ చేసుకునే వినియోగదారులకు జీ5 ప్రీమియం యాక్సెస్ ఉచితంగా లభిస్తుంది. ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా దీన్ని యాక్టివేట్ చేసుకోవాలి .
జీ5లో ఏమున్నాయి?
జీ5 తన కస్టమర్ల కోసం సమ్మర్లో బోల్డంత ఎంటర్టైన్మెంట్ తీసుకొచ్చింది.
12 భాషల్లో ఒరిజినల్ కంటెంట్ దీనిలో ఉంది.
ఇక 4,500 సినిమాలు, టీవీ షోలు ఉన్నాయని జీ5 తెలిపింది.