బీఎస్ఎన్ఎల్ తన యూజర్లకు మరో బంపర్ ఆఫర్ తెచ్చింది. 365 రూపాయలతో రీఛార్జి చేసుకుంటే ఏడాది మొత్తం వ్యాలిడిటీ వచ్చే ఈ సరికొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ తాజాగా ప్రకటించింది. పెద్దగా అవుట్ గోయింగ్ కాల్స్ అవసరం లేని వారికి ఈ ప్లాన్ బాగా ఉపయోగపడుతుంది.
ప్లాన్ డిటెయిల్స్
* రూ.365 రీఛార్జ్ చేయించుకోవాలి.
* 365 రోజుల వ్యాలిడిటీ పొందొచ్చు.
* మొదటి రెండు నెలలు రోజుకు 250 నిమిషాల కాల్స్, 2జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు ఉచితం. అంతకన్నా ఎక్కువ ఉపయోగిస్తే ఛార్జీలు చెల్లించాలి.
* మిగతా 10 నెలలు వ్యాలిడిటీ మాత్రమే లభిస్తుంది.
* మిగతా రోజుల్లో కాల్స్, డేటా ఉపయోగించుకోవాలనుకుంటే టాప్ అప్ చేయించుకోవాలి.
ఏపీకి వర్తింపు
ఈ ప్లాన్ కొన్ని రాష్ట్రాలకే పరిమితం. ఆంధ్రప్రదేశ్ సర్కిల్లోని యూజర్లకు కూడా ఈ ఏడాది రీఛార్జి ప్లాన్ అందుబాటులో ఉంది. అయితే ఆన్లైన్లో మాత్రమే రీఛార్జ్ చేసుకోవాలని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది.